ఫైబర్ నెట్ స్కాంలో ఏపీ సీఐడీ చార్జీషీట్

A 1 గా చంద్రబాబు, A 2గా వేమూరి హరి కృష్ణ పేర్లు దాఖ‌లు

ఫైబర్ నెట్ స్కాంలో ఏపీ సీఐడీ చార్జీషీట్

విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది . అందులో A 1 గా చంద్రబాబు, A 2గా వేమూరి హరి కృష్ణ, A 3గా కోగంటి సాంబ శివ రావుల పేర్ల‌ను చేర్చింది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఏపీలో అధికారం కోల్పోయిన త‌ర్వాత‌ టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయ‌న పాలనలో నిర్మించిన‌ పలు ప్రాజెక్టులపై ఏసీ సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇటీవ‌లే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు రాజమండ్రి జైలులలో రిమాండ్ అనుభవించిన విష‌యం తెలిసిందే.. ఆయనకు అనారోగ్యం కార‌ణాల‌ వ‌ల్ల ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వ‌డంతో  బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును మరో కేసు వెంటాడుతోంది. 

ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ఏ1 గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు అయ్యింది. చంద్రబాబు కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 114 కోట్లు నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్‎లో పేర్కొంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 330 కోట్లు కాగా అందులో రూ. 114 కోట్లు చంద్రబాబు వ‌ల్ల‌ నష్టం వాటిల్లిందని సీఐడీ అధికారులు ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కాం జరిగిందని సీఐడీ చార్జ్ షీట్లో పేర్కొంది. వేమూరి హరి కృష్ణని నిబంధనలకు విరుద్దంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్‎గా చంద్ర‌బాబు నియమించారని తెలిపింది. ఉద్దేశ పూర్వకంగానే హరి కృష్ణని అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నియమించారని తెలిపింది. విధి విధానాలు లెక్క‌చేయ‌కుండా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‎కు చంద్రబాబు ఇష్టారీతిలో అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‎ను వేమూరి హరి కృష్ణకు అప్ప‌గించేందుకు ప్రాజెక్ట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని  సీఐడీ అధికారులు తెలిపారు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరి ప్రసాద్‎ను నియమించేందుకు చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. 

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

వేమూరి హరి కృష్ణ టేరాసాఫ్ట్ కంపెనీనీ బ్లాక్ లిస్ట్‎లో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టేరా సాఫ్టు‎కు ఈ ప్రాజెక్ట్ వచ్చేలా ప్లాన్ చేశారని తెలియ‌జేసింది. మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసినా వాటిని లెక్క‌చేయ‌కుండా వేమూరి హరి కృష్ణకు టెండర్ దక్కేలా చేసిన‌ట్లు తెలిపింది. సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే అత‌డిని చంద్ర‌బాబు ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది. స్కాం ద్వారా కొల్లగొట్టిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, ఏపీ హై కోర్టు ముందస్తు బెయిల్‎ను నిరాక‌రించింది.  ప్రస్తుతం చంద్రబాబు సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సీఐడీ తన ఛార్జ్ షీట్‎లో పొందుపరిచింది.

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?