అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం 2500 ర‌కాల వంట‌కాలు.. హాజ‌రు కానున్న ప్ర‌పంచ కుబేరులు

అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం 2500 ర‌కాల వంట‌కాలు.. హాజ‌రు కానున్న ప్ర‌పంచ కుబేరులు


ప్ర‌పంచ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట ఇప్పుడు వివాహ‌ హడావుడి జరుగుతోంది. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ పెళ్లివేడుకలు కనీవినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.  ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ  ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల‌కు సర్వం సిద్ధమవుతోంది. జులై 12వ తేదీన అనంత్ వివాహం జరగనుండ‌గా  మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్ లో ముంద‌స్తు పెళ్లి వేడుకలు జ‌రుగ‌నున్నాయి. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీకి వివాహం కుదిరిన విష‌యం తెలిసిందే.. ఈ ముందస్తు పెళ్లివేడుకలకు దేశంలోని అతిర‌థ మ‌హార‌థులు ప్రముఖలు హాజ‌రుకాబోతున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి ఈ వేడుక‌ల‌కు తరలిరానున్నారు. వీరి కోసం ఘుమఘమలాడే ప్ర‌త్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత పేరుగడించిన 25 మంది చెఫ్‌ల బృందం వంట‌లు చేసేందుకు వ‌స్తోంది. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన‌ వంటకాలు స‌హా ఇండోర్ ఫుడ్‌కు ప్రాధాన్యమివ్వనున్నారు.

మెక్సికన్ నుంచి జపనీస్ వరకు, పార్సీ నుంచి థాయ్ వరకు అన్ని రకాల వెరైటీలు సిద్ధం చేయబోతున్నారు. ఆసియన్ వంటలకు అత్యంత ప్రాధాన్యమివ్వనున్న‌ట్లు స‌మాచారం. అతిథులకు ఏమైనా స్పెషల్ వంటకం కావాల్సి వస్తే కూడా చిటికెలో చేసి ఇచ్చేలా వంట‌కాల ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. అతిర‌థ మ‌హారాజుల‌ ఆహార అవసరాలకు గుర్తించి మెనూ సిద్ధం చేస్తున్నారు.  అతిథులు జీవితంలో మర్చిపోలేని విధంగా రుచికరమైన పదార్థాలు అందించాల‌ని య‌త్నిస్తున్నారు. ఇందు కోసం దాదాపు 2,500 రకాల వంటకాలను వ‌డ్డించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకరోజు వడ్డించిన వంటకాలు మరోరోజు వ‌డ్డించ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అల్పాహారం కోసమే 70 రకాల వంటకాలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం లంచ్‌ కి, రాత్రి డిన్నర్ కు దాదాపు  250 ర‌కాల చొప్పున రుచుల‌ను వ‌డ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శాఖాహార వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  రేయింబళ్లు మూడురోజులపాటు జరగనున్న ఈ వేడుకల కోసం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో కూడా స్నాక్స్ అందించనున్నారు.

ప్రపంచ నలుమూలల నుంచి వెయ్యిమందికి పైగా  హాజరుకానున్నారు . బిల్ గేట్, మెలిండా గేట్స్‌ తోపాటు మెటా సీఈఓ మార్క్‌జూకర్‌బర్గ్, ఆల్ఫాబెట్ సీఈఓ  సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్,  బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్ వంటి వారు మ‌రెంద‌రో ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేయ‌నున్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, సునీల్ మిట్టల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ, పవన్ ముంజాల్ వంటి వారికి ఆహ్వానాలు అందాయి. బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తోపాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీతో స‌హా ముంబయి ఇండియన్స్‌ టీం ఆట‌గాళ్లు హాజ‌రుకానున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?