Ambani and adani deal : అంబానీ - అదానీ సంస్థల మధ్య కుదిరిన ఆసక్తికరమైన డీల్... విద్యుత్ ప్రాజెక్టులో 26%..
దేశీయ కార్పొరేట్ రంగంలో ఆసక్తికరంగా మారిన ఈ డీల్ ముందు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే వాదనలు కూడా మెండుగా వినిపిస్తున్నాయి. మరి ఆ రెండు దిగ్గజ కంపెనీలు ఏంటి..? ఆ రెండు కంపెనీలు ఏ బిజినెస్ లో చేతులు కలిపాయి అనే విషయానికొస్తే...గౌతమ్ అదానికి చెందిన విద్యుత్ ప్రాజెక్టులో ముఖేష్ అంబానీ సారధ్యంలో ఉన్న రిలయన్స్ సంస్థ దాదాపు 20% వాటాను కొలుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అదానికి చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ 26% వాటాలను కొనుగోలు చేయడం జరిగింది. దీనికోసం అదాని పవర్ సంస్థ కు పూర్తి అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జీ లిమిటెడ్ లో అంబానీ రిలయన్స్ సంస్థ 5 కోట్ల ఈక్విటీ షేర్ లను సొంతం చేసుకుంది.

అయితే అంబానీ అదానీల మధ్య వ్యాపార పోటీ ఉందన్న వార్తలు ఎప్పటినుంచో వినిపించినప్పటికీ దానికి సంబంధించిన అధారాలు మాత్రం ఇప్పటివరకు లభించలేదు. అంతేకాదు ఈ రెండు దిగ్గజ కంపెనీలు ఒకే వ్యాపార రంగంలో పోటీ పడుతున్న సందర్భాలు కూడా లేవు. వీరిద్దరూ కూడా ఒకే ఒక స్వచ్ఛ ఇందన వ్యాపారం మినహాయించి మరి ఎక్కడ కూడా ఒకేలాంటి వ్యాపారాలు ఇప్పటివరకు చేయలేదు.
చమురు గ్యాస్ మరియు టెలికం వంటి సంస్థలు అంబానీ వ్యాపారాలు అయితే...బొగ్గు తవ్వకం నుండి ఎయిర్ పోర్ట్ ల వరకు అదాని వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే ఒక సందర్భంలో వీరిద్దరి మధ్య వ్యాపార పోరు కొనసాగుతుందా అన్న చర్చలు 5జి స్పెక్ట్రమ్ కొనుగోలు సమయంలో చోటు చేసుకున్నప్పటికీ వాటికి త్వరగానే పులిస్టాప్ పడింది.
ఎందుకంటే అదానీ గ్రూప్స్ దరఖాస్తు చేసుకున్న 5జీ స్పెక్ట్రమ్ పబ్లిక్ నెట్వర్ కు కోసం కాదని ఆ సమయంలో వెళ్లడైంది. ఇది ఇలా ఉండగా 2022లో అంబానీ తో సంబంధం ఉన్న ఎన్డీజీలో తనకున్న వాటాలని అదానికి అమ్మేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన చిన్న కొడుకు పెళ్లికి అదాని కూడా హాజరయ్యారు. ఇంతలోనే ఈ ఆసక్తిక డీల్ తెరపైకి వచ్చింది. దీంతో ప్రస్తుతం కార్పొరేట్ వర్గాలలో ఈ న్యూస్ తీవ్ర చర్చానియాంశంగా మారింది.
