Petrol :  గుడ్ న్యూస్.. పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు...

Petrol  :  గుడ్ న్యూస్.. పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు...

 దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరల్లో పెద్దగా తేడా కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు మండిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం కానీ తగ్గించటం కానీ చేయడం లేదు.గతంలో పోల్చితే క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ మన దేశంలో ఇంధన ధరలు మాత్రం తగ్గలేదు.  కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో పెట్రోల్, డీజిల్ పై పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. 

పెట్రోల్, డీజిల్ ధర పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేస్తు కేంద్రం దిగొచ్చేంత వరకు పోరాటం ఆగదు అంటున్న ఉత్తమ్.వంట గ్యాస్ ధర తగ్గిన నైపద్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టెచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్త తెచ్చింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత డీజిల్, పెట్రోల్ ధరలు ఉపశమనం కలిగించింది.

డీజిల్, పెట్రోల్ ధరలు ఒక్కో లీటర్ పై రూ.2 చొప్పున కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియాలోX లొ ప్రకటన చేశారు.ఈనెల మార్చి 15, 2024వ తేదీ,ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించటానికి ప్రాధాన్యత సంతరించుకుంది..

petrol
 డీజిల్,పెట్రోల్ ధరలు లీటర్ రూ.2 చొప్పున తగ్గించటం వల్ల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లా మంది భారతీయుల కుటుంబ సంక్షేమం తన లక్ష్యం అని నిరూపించాడు. దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినట్లు ప్రకటించింది.అయితే కొత్త ధరలు మార్చి 15, 2024 ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది.

పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ X లొ తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించటమె గాక వినియోగదారుల వ్యాయాలను పెంచి ఆపరేటింగ్ వ్యాయాలను తగ్గిస్తుంది అని పేర్కొన్నారు.ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.94.72కు వచ్చింది.కోల్ కతాలొ పెట్రోల్ ధర రూ.104.94గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.104.21 ఉంది.చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.75కు దిగి వచ్చింది. ఇక ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.87.62కు తగ్గింది.ఇక ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.92.15కు దిగింది..

  తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో ప్రధాన నగరంలో రేట్లు ఏ విధంగా ఉండేవో ముందు తెలుసుకుందాం.హైదరాబాద్ మహానగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.25 తగ్గించగా రూ.107.41 దిగి వచ్చింది. హైదరాబాదులో లీటర్ డీజిల్ ధర రూ.2.27 తగ్గించగా రూ.95.65కు వచ్చింది.మరొక నగరం వరంగల్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.99 తగ్గింది.వరంగల్లో లీటర్ డీజిల్ ధర రూ.95.25 దిగి వచ్చింది. కరీంనగర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.22 కు తగ్గింది.

ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.45 తగ్గి 109.31 కుచేరింది. ఈ నగరంలో లీటర్ డీజిల్ ధర రూ.2.34కు తగ్గిరూ.97.17 కు చేరింది. వైజాగ్ లో పెట్రోల్ పై లీటర్ కు రూ.2.29 తగ్గగా ప్రస్తుతం108.29కు దిగి వచ్చింది. లీటర్ డీజిల్ ధర రూ.2.29కు తగ్గి ప్రస్తుతం96.17కు దిగి వచ్చింది. అయితే తగ్గించిన ఇందన ధరలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ధరల తగ్గింపు ఎన్నికల కోసమే అని విమర్శిస్తున్నాయి. ఈరోజు అనగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్,డీజిల్ ధరలను ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?