Vegetables Cultivation With Drainage Water : హైదరాబాదీయులకు అలర్ట్.. మార్కెట్లో ఫ్రెష్ గా ఉన్నాయని కూరగాయలు కొనేస్తున్నారా? 

 Vegetables Cultivation With Drainage Water : హైదరాబాదీయులకు అలర్ట్.. మార్కెట్లో ఫ్రెష్ గా ఉన్నాయని కూరగాయలు కొనేస్తున్నారా? 

Vegetables Cultivation With Drainage Water : హైదరాబాద్ లో ఏ కూరగాయల మార్కెట్ లో చూసినా, కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అబ్బ.. కూరగాయలు, ఆకుకూరలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయని వాటిని చూడగానే కొందరు కొనేస్తుంటారు. గ్రామాల్లో కూడా ఇంత ఫ్రెష్ కూరగాయలు దొరకవని అనుకుంటూ ఉంటారు.

ఏంతైనా సిటీ సిటీయే అని అనుకొని సిటీల్లోనే కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయని అనుకుంటారు. కానీ.. అసలు నిజం తెలిస్తే మీరు హైదరాబాద్ లో కూరగాయలు, ఆకుకూరలు కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. పదండి ఎందుకో తెలుసుకుందాం. 

సాధారణంగా కూరగాయలను గ్రామాల్లో ఎలా పండిస్తారో అందరికీ తెలుసు. కానీ.. నగరాల్లో ఎలా పండిస్తారు. అసలు అక్కడ పండించే ప్లేస్ కూడా ఉండదు కదా. గ్రామాల్లో పంట పొలాల్లో కూరగాయల సాగు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ.. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూరగాయలు ఎక్కడ పండిస్తారు. అసలు ఎలా పండిస్తారు అనే విషయం కూడా తెలుసుకుంటే ఇంకోసారి హైదరాబాద్ లో కూరగాయలు కొనాలంటేనే జంకుతారు. 

21 -1

Vegetables Cultivation With Drainage Water : మురుగునీటితో కూరగాయల సాగు

హైదరాబాద్ లో ఉన్న దాదాపు అన్ని కూరగాయల మార్కెట్లలోకి వచ్చే కూరగాయలు, ఆకుకూరలు వేటితో పండిస్తున్నారో తెలుసా? మురుగునీటితో. మురుగునీరు అనగానే టెన్షన్ వచ్చేసింది కదా. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అసలు కూరగాయల పండించే తీరు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు కాలుష్యంతో, మురుగునీటితో నిండిపోయాయి. 

ఆ నీటితోనే కూరగాయలు పండిస్తున్నారట. దీనిపై తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మురుగునీటితో ఆకుకూరలు, కూరగాయలు పండించే విధానాన్ని అడ్డుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ కూరగాయలు, ఆకుకూరలు తింటే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని కోర్టు తెలిపింది. అందుకే అలాంటి కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్ లోకి రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 13 చెరువులు ఉన్నాయి. అందులో అన్ని చెరువులు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి. కాలుష్య కాటారాలుగా మారాయి. చెరువుల్లోకి డ్రైనేజీ నీరు, మురుగు నీరు, సెప్టిక్ ట్యాంక్ నీరు.. అన్నీ కలిసి చెరువులు మొత్తం దారుణంగా తయారవుతున్నాయి. దాని వల్ల చెరువుల్లోని చేపలు కూడా చనిపోతున్నాయి. 

చెరువుల్లోకి మురుగునీరు, డ్రైనేజీ నీరు చేరకుండా అడ్డుకోవాలని కోర్టు.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో పాటు.. అడ్వొకేట్ కమిషన్ నివేదిక సూచనలను అమలు చేయాలని.. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

21 -2

చెరువుల్లో మురుగునీటి అడ్డుకట్ట కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక కూడా అందించాలని తెలిపింది. దాని కోసం చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆ నివేదికలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు వెల్లడించాలని కోర్టు తెలిపింది. వచ్చే నెల ఏప్రిల్ 29లోగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండించే కూరగాయల సాగుపై 2007లో కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. అప్పటి నుంచి ఈ కేసు విచారణ దశలోనే ఉంది. తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మురుగునీటితో చేసే కూరగాయల సాగును వెంటనే ఆపించేయాలని కోర్టు స్పష్టం చేసింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?