Relangi Narasimha Rao : ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి.. కానీ అతడితో టైం వేస్ట్ '
- డైరెక్టర్ రేలంగి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు..!
Relangi Narasimha Rao : తెలుగు పరిశ్రమలో డైరెక్టర్ గా రేలంగి నరసింహారావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇతరులను బాగా నవ్వించాలంటే ముందుగా మనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. కానీ ఆయన నవ్వకుండానే ఇతరులను నవ్వించడంలో దిట్ట. రేలంగి నరసింహారావు కు అది బాగా తెలిసిన కళ. గురువు దాసరి నారాయణ వద్ద అనేక సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత రేలంగి నరసింహారావు తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాలలో నవ్వులు పూయించారు. 70 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమా ' చందమామ '. అది ముందుగా వెలుగు చూడలేదు. ఆ తర్వాత రేలంగి తనలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీగా ట్రై చేశారు. అలా రూపొందిన సినిమా ' నేను మా ఆవిడ '. ఈ హాస్య భరిత సినిమా జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రేలంగి దర్శకత్వంలో ఏవండోయ్ శ్రీమతి గారు, ఇల్లంతా సందడి కూడా నవ్వులు పూయించాయి. అప్పుడు మొదటి సినిమా చందమామ కూడా వెలుగు చూసింది.
కథ మొదట అనుకున్నాక రైటర్ దగ్గరికి వెళ్లి డెవలప్ చేయాలనుకున్న రేలంగికి ముందు సినిమా ప్రొడ్యూసర్ అయిన భాస్కర్ రెడ్డి మళ్ళీ సినిమా నిర్మిస్తానని చెప్పడంతో ఒక మంచి పేరున్న రైటర్ వద్దకు వెళితే హోటల్లో రూమ్ బుక్ చేయించుకొని మూడు నెలలు కథ గురించి చర్చలు వదిలేసి వేరే ఇతర విషయాలు గురించి మాట్లాడి టైం వృధా చేసేసారని అన్నారు. ప్రస్తుతం ఆయన మరణించారు. అందుకే పేరు చెప్పడం లేదంటూ రైటర్ పేరు చెప్పడానికి రేలంగి ఇష్టపడలేదు. ఇక చివరికి నిర్మాతను హేళనగా మాట్లాడడంతో నచ్చక ఆయనను వదిలించుకొని నేనే కథ పూర్తిగా సిద్ధం చేసి మరో ఇద్దరు రైటర్లు, నాకు తెలిసిన వాళ్లకు కథ వినిపించి వారంలో స్క్రిప్ట్ పూర్తి చేసి షూటింగ్ కి వెళ్ళానని ఆ సినిమా విశేషాలను రేలంగి పంచుకున్నారు.
