Three suicides in family: రెవెన్యూ అధికారులు మోసం చేశార‌ని.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Three suicides in family: రెవెన్యూ అధికారులు మోసం చేశార‌ని.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య


Three suicides in family: బద్వేలు :  వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం.కొత్త మాధవరం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శ‌నివారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. తల్లి కూతురు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్ప‌డ‌గా, మరొకరు అదే స‌మ‌యంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం రెవెన్యూ అధికారులేన‌ని మృతుల బంధువులు తెలిపారు.

స్థానికుల కథనం ప్రకారం.. మాధ‌వ‌రం గ్రామానికి చెందిన‌ సుబ్బారావు(47) చేనేత కార్మికుడిగా జీవనం కొన‌సాగిస్తున్నాడు. అత‌నికి మూడెక‌రాల పొలం ఉన్న‌ది. అయితే అది అమ్ముదామ‌ని ప్ర‌య‌త్నం చేయ‌డంతో అది ఇత‌రుల పేరుతో రికార్డుల్లో ఉంది. రెవెన్యూ అధికారుల మోసం వ‌ల్ల దానిని అమ్మేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన ఆయ‌న కుటుంబంతో ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు.

శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి(41), కుమార్తె వినయ(17) ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట వ‌ద్ద   రైలు కిందపడి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సీఐ పురుషోత్తమరాజు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో సూసైడ్ నోట్ లభించింది.

మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా.. రికార్డులు తారుమారు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య కు పాల్ప‌డుతున్న‌ట్లు  అందులో రాసి ఉంది. పొలం వేరే వాళ్ల పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారుల మోసం కార‌ణంగా చనిపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. కాగా అదే మండలానికి చెందిన ఓ అధికార పార్టీ వైసీపీ నాయకుడు రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి సుబ్బారావు భూమిని తన పేరుతో ఆన్ లైన్‌లో నమోదు చేయించుకున్నట్లు ఆరోపణలు మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?