Coconut water :  సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.. అయితే ఏ టైంలో తాగాలో తెలుసా..?

Coconut water :  సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా.. అయితే ఏ టైంలో తాగాలో తెలుసా..?

Coconut water : సమ్మర్ సీజన్ లో సూర్యతాపం నుండి ఉపశమనం పొందేందుకు కొందరు చల్లటి పానీయాలు తాగుతూ ఉంటారు.మరి కొందరు ఒంటికి చలువ చేసి పుచ్చకాయలు వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు లాంటివి తాగుతూ ఉంటారు. వీటన్నిటిలో కూడా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వేసవిలో దీనిని తాగటం వలన చాలా కాలం పాటు శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.తక్షణ శక్తి కోసం ఎన్ని పానీయాలు  తాగిన కొబ్బరి నీళ్ళు లాగా రిఫ్రెష్ శక్తినిచ్చే పానీయాలు మరొకటి  లేదు అంటే  అతిశయోక్తి కాదు. సమ్మర్ లో రకరకాల సీజనల్  ఫ్రూట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి.మామిడి పండ్లు, చీమ చింతకాయలు,తాటి ముంజలు ఇలా ఎన్నో రకాల పండ్లు మనకు దొరుకుతూ ఉంటాయి.

ఈ సీజనల్ ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొబ్బరి బొండాలు ఎప్పుడు దొరుకుతాయి.కానీ సమ్మర్ లో  మాత్రం ఈ కొబ్బరినీళ్లు ఆవశ్యకత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగటం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సమ్మర్ లో కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవటానికి ఎంతగానో తోడ్పడుతాయి.ఒక కొబ్బరి బోండా నీళ్లు తాగితే చాలు రోజంతా హుషారుగా అనిపిస్తుంది.

175 -2

అంతేకాక బాడీని కూడా కూల్ గా ఉంచుతుంది. ఈ కొబ్బరి నీళ్లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి,జింక్, మెగ్నీషియం, కాలుష్యం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని అతి పెద్ద స్పెషాలిటీ ఏమిటి అంటే దీన్ని తాగటం వల్ల శరీరంలో నీటి లోపం ఉత్పన్నం కాదు. శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది.

వేసవిలో డిహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. కొబ్బరి నీళ్లు, దోసకాయ లాంటి వాటిని తీసుకోవడం చాలా మంచిది.. ఆరోగ్య నిపుణుల చెప్పి దారి ప్రకారం కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్ ను వెంటనే అందించేందుకు పనిచేస్తాయి.

అలాగే రక్తంలో చక్కెరను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే చాలామంది కూడా సమయపాలన అనేది లేకుండా ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు.కొబ్బరి నీళ్లు తాగడంలో సమయపాలన చాలా అవసరం అని అంటున్నారు నిపుణులు.

దాని వలన మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు అని అంటున్నారు. సమ్మర్ లో కొబ్బరి నీళ్లను ఏ టైంలో తాగాలనే విషయం చాలా మందికి తెలియదు. కొంతమంది అయితే ఖాళీ కడుపుతో తీసుకుంటే, మరి కొందరు మధ్యాహ్నం తాగటం మంచిదని భావిస్తారు. ఈ విషయంపై జైపూర్ కు చెందినటువంటి డైటీషియన్ కొన్ని సూచనలు చేశాడు.

175 -3
కొబ్బరి నీళ్లలో భోజనం చేసిన తర్వాత కానీ,భోజనంతో కానీ అస్సలు తాగకూడదు అని అన్నారు.గుండెల్లో మంట సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది అని అన్నారు.ఖాళీ కడుపుతో ఈ హెల్త్ డ్రింక్ తాగటం వలన కూడా జీవక్రియ పెరుగుతుంది.

బరువును కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లు ఉదయం వేళలో తాగినట్లయితే మరింత ప్రయోజనాకరం అంటున్నారు. కడుపు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఎన్నో వ్యాధులు లేక ఆరోగ్య సమస్యల నుండి రక్షించబడుతుంది.కావాలంటే నిపుణుల సలహా మేరకు మధ్యాహ్నం టైంలో కూడా తాగవచ్చు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?