IPL 2024 : ధోని కోసం 64 వేలు ఖర్చు చేసి స్టేడియం కు వచ్చిన వీరాభిమాని..

IPL 2024 : ధోని కోసం 64 వేలు ఖర్చు చేసి స్టేడియం కు వచ్చిన వీరాభిమాని..

IPL 2024 : ఒకప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుత కాలంలో క్రికెట్ కి విపరీతమైన ప్రజాదరణ ఉంది. దీంతో సినీ సెలెబ్రేటిలకు ఫాన్స్ ఉన్నట్లుగానే స్టార్ క్రికెటర్లకు కూడా డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు.మరీ ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకిి దేశవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు.

కేవలం అతన్ని , అతని ఆటను చూసేందుకే అభిమానులు స్టేడియంకి క్యూ కడతారు.మరీ ముఖ్యంగా భారతదేశంలో జరిగే ఐపీఎల్ సిరీస్ లో ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ స్టేడియం కి వెళ్ళినా సరే ఆ స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీతో నిండిపోవడం ఖాయం. ఇదంతా కేవలం ధోని వలనే సాధ్యమనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి ధోని కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. కొన్నిసార్లు ఆ అభిమానలు హద్దులు కూడా దాటుతుంటారు. తాము డై హార్డ్ ఫాన్స్ అని నిరూపించుకునేవారు ధోని కోసం ఎంతకైనా తెగిస్తారు. తమ సొంత విషయాలు సైతం పట్టించుకోకుండా తావత్ కి మించి ఖర్చు చేయడానికి వెనకాడ బోరు.  అందులోనూ ఈసారి ధోని ఆడుతున్న చివరి ఐపీఎల్ సీజన్ కావడంతో ధోనిని చూసేందుకు అభిమానులు మరింత ఆసక్తి చూపుతున్నారు.

152 -3

ఈ నేపద్యంలోనే ఇటీవల ఓ ధోని అభిమాని తన కూతుర్ల ఫీజు కోసం దాచుకున్న డబ్బులు సైతం ఖర్చు చేసి మరి మహేంద్రసింగ్ ధోని ని చూసేందుకు తన ముగ్గురు కూతుర్లతో కలిసి స్టేడియం కి వచ్చాడు. ఇప్పుడు తన కూతుర్ల ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవట.

ఇక ఈ విషయాన్ని మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ధోనిని చూసేందుకు కూతుర్ల చదువుల కోసం దాచిన డబ్బులు వృధా చేసిన ఆ వ్యక్తి విమర్శల పాలవుతున్నాడు...పూర్తి వివరాల్లోకి వెళ్తే...

 సాధారణంగానే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ లో ధోని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మైదానాలకు వస్తుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉందంటే చాలు...ఏ మైదానమైన సరే దాదాపుగా పసుపు రంగు  తోనేే నిండిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధోని కోసమే గ్రౌండ్ కి వస్తారు .అదేవిధంగా తమిళనాడుకు చెందిన వీర అభిమానులు కూడా ధోనీ కోసం మైదానాలకు వస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ధోని వీరాభిమాని ఏకంగా 64 వేలు వెచ్చించి ధోనిని చూసేందుకు తన ముగ్గురు కూతుర్లతో కలిసి గ్రౌండ్ కి వచ్చాడట. చెన్నై లో మ్యాచ్ ఉన్నప్పుడు అతనికి టికెట్లు దొరకకపోవడంతో... బ్లాక్ లో ఆ టికెట్స్ ను 64 వేలు పెట్టి కొనుగోలు చేశాడట. అయితే ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత అతను చెప్పిన అసలు నిజం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

152 -1
అయితే తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని వారి స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బుల తో ధోనిని ఒక్కసారైనా చూడాలనే ఉద్దేశంతో 64 వేలు పెట్టి బ్లాక్ లో టికెట్లు కొని తన ముగ్గురు పిల్లలతో స్టేడియం కు వచ్చినట్లుగా  తెలియజేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ధోని పై అతనికి ఉన్న అభిమానాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు

కానీ అతను చేసిన పని చూసి చాలామంది తిట్టుకుంటున్నారు. అభిమానం ఉండాలి కానీ మరీ ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తించకూడదని అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. క్రికెటర్స్ అయిన సరే మొదట వారి యొక్క వ్యక్తిగత విషయాలకే ప్రాథన్యత ఇస్తారని అలాంటిది కూతుళ్ళ ఫీజు కు డబ్బులు లేనప్పుడు 64 వేలు ఖర్చు పెట్టి బ్లాక్ లో టికెట్ కొనాల్సిన అవసరం ఏముంది అంటూ మండిపడుతున్నారు.

అయితే దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?