Mi Vs RCB : వాంఖాడే వేదికగా ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్...
ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకోగా, తొలిత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 197 లక్ష్యాన్ని 3 వికెట్లు నష్టపోయి కేవలం 15.3 ఓవర్లలోనే ముగించింది. దీంతో వాంఖాడే వేదికగా ముంబై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్స్ ఫాఫ్ డూప్లెస్ 40 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్స్ లతో 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా అతనితో పాటు రజాట్ పట్టిదర్ 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ అంతా వరుసగా పెవిలియన్ బాట పట్టగా దినేష్ కార్తీక్ 5 బౌండరీలు 4 సిక్స్ లతో 53 పరుగులు చేసి చివరిదాకా బరిలో నిలబడ్డారు. దీంతో RCB నిర్దేశిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగలిగింది.
ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లు జస్ప్రీత్ బూమ్రా ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. అతనితోపాటు జరల్డ్ కెట్ జీ 1 , శ్రేయస్ గోపాల్ 1 , ఆకాశ్ మద్వాల్ 1 వికెట్ తీసుకున్నారు.
సత్తా చాటిన ముంబై బ్యాటర్లు...

అనంతరం167 పరుగుల లక్ష్య చేధనతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ సునామి సృష్టించారు. ప్రతి బంతిని బౌండరీకు తరలిస్తూ RCB బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 7ఫోర్లు 5 సిక్స్ లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా , రోహిత్ శర్మ 38 , సూర్య కుమార్ యాదవ్ 52 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్దేశిత లక్ష్యాన్ని కేవలం 15.3 బంతులలో చేదించి హోమ్ గ్రౌండ్ వేదికగా ఘనవిజయం సాధించింది.
RCB బౌలర్ల విషయానికొస్తే..
ఆకాశ్ దీపు 1 ,వైషక్ విజయ్ కుమార్ 1 , విల్ జాక్స్ 1 వికెట్ పడగొట్టారు. దీంతో పాయింట్ల పట్టికలో ఆర్సిబి 9వ స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ ఏడో స్థానానికి చేరుకుంది.
