RCB Vs GT IPL 2024 : హ్యాట్రిక్ విజయం అందుకున్న బెంగళూరు...గుజరాత్ పై ఘనవిజయం...
ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ లక్ష్యాన్ని సనాయాసంగా ఛేదించి ఘనవిజయం అందుకుంది.
ఈ క్రమంలోనే ఆర్సీబీ 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేదించింది. దీంతో వరుస విజయాలతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను నిలబెట్టుకోగలిగింది. మరోవైపు గుజరాత్ సంక్లిష్టమైన మ్యాచ్ లో ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయని చెప్పాలి. గుజరాత్
ఇన్నింగ్స్...
అనంతరం బరిలో దిగిన ఇంపాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్ కూడా 14 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో గుజరాత్ తీవ్ర కష్టాల్లో మునిగిపోయింది. ఇక తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో 3 ఫోర్లు ,2 సిక్స్ లతో 30 పరుగులు చేయగలిగాడు. అతనితో పాటు తేవాటియా 21 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్ తో 35 పరుగులు సాధించాడు.
ఆ తర్వాత రషీద్ ఖాన్ 14 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరగా , విజయశంకర్ 10 పరుగులకే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గుజరాత్ బ్యాటర్స్ అందరూ విఫలం అవడంతో గుజరాత్ 19.3 ఓవర్ లో 147 పరుగులు మాత్రమే సాధించి ఆల్ అవుట్ అయింది.
ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు ,యాష్ దయాల్ 2 వికెట్లు ,వైశక్ విజయ్ కుమార్ 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే కర్ణ శర్మ 1 ,కామెరాన్ గ్రీన్ 1 వికెట్ పడగొట్టారు.
బెంగళూరు ఇన్నింగ్స్...
148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు గుజరాత్ అందించిన లక్ష్యాన్ని సునాయాసంగా చేదించి ఘనవిజయం సాధించింది. ఇక ఈ లక్ష చేధనలో ఆర్సీబీ మాజీ కెప్టెన్స్ ఫాఫ్ డుప్లేస్సిస్ , విరాట్ కోహ్లీ గట్టి ఆరంభాన్ని అందించారు. ఇక వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ భాగస్వామ్యంలో 92 పరుగులు నెలకొల్పారు.
ఈ క్రమంలోనే ఫాఫ్ డూప్లిసెస్ 23 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్స్ లతో 64 పరుగులు చేయగా , విరాట్ కోహ్లీ 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం బరిలో దిగిన ఆర్సీబీ బ్యాటర్స్ స్వల్ప పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఆర్సీబీ 125 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన దినేష్ కార్తీక్ మరియు స్వప్నిల్ సింగ్ ఆర్సీబీని విజయ తీరాలకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయుడుగా నిలవగా , స్వప్నిల్ సింగ్ 15 పరుగులు సాధించి ఆర్సీబీ కి ఘనవిజయం అందించారు. దీంతో బెంగళూరు 148 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి కేవలం 13 ఓవర్లలోనే ముగించింది. ఇక గుజరాత్ బౌలర్సు జాషువా లిటిల్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టగా , నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నాడు.