RCB vs SRH, IPL 2024 : చిన్న స్వామి స్టేడియం వేదికగా SRH సరికొత్త రికార్డు... ఆర్‌సీబీపై 287 ప‌రుగులు

RCB vs SRH, IPL 2024 : చిన్న స్వామి స్టేడియం వేదికగా SRH సరికొత్త రికార్డు... ఆర్‌సీబీపై 287 ప‌రుగులు

 RCB vs SRH, IPL 2024 :  ఐపీఎల్ 2024 లో భాగంగా ఇటీవల చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన RCB మరియు  SRH మ్యాచ్లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది . అయితే ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ ను నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇటీవల మరోసారి తన రికార్డును తానే బ్రేక్ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దిష్ట 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం 288 భారీ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు నిర్దిష్ట 20 ఓవర్లలో 262 పరుగులకే కుప్పకూలిపోయింది.

దీంతో హోమ్ గ్రౌండ్ వేదికగా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. 

చిన్న స్వామి స్టేడియంను శాసించిన హైదరాబాద్ బ్యాటర్లు....

హైదరాబాద్ బ్యాటర్లతో చిన్న స్వామి స్టేడియం మార్మోగింది. సిక్స్ లు ఇంత తేలిగ్గా కొట్టవచ్చా అనే రీతిలో హైదరాబాద్ బ్యాటర్స్ సునామీ సృష్టించారు. హైదరాబాద్ బ్యాటర్ల తాటికి తట్టుకోలేని బెంగళూరు బౌలర్లు గల్లంతయ్యారు. ఇక ఈ మ్యాచ్ లో బెంగళూరు వేసిన ప్రతి బంతి కూడా బౌండరీ వెళ్ళసాగింది.

16 -1

దీంతో బెంగళూరు బౌలింగ్ లో మార్పులు చేర్పులు చేపట్టినప్పటికీీ ప్రయోజనం రాలేదు. ఈ నేపథ్యంలోనే 41 బంతుల్లో 9 ఫోర్లు 8 సిక్స్ లతో  హెడ్ 102 పరుగులు చేశాడు. అతనితోపాటు క్లాసన్ 31 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్స్ లతో 67 పరుగులు చేశాడు.

అదేవిధంగా మార్కమ్ 17 బంతులో 2 ఫోర్లు 2 సిక్స్ లతో 32 పరుగులు చేయగా , అబ్దుల్ సమాద్ కేవలం 16 బంతులలో 4 ఫోర్లు 3 సిక్స్ లతో 37 పరుగులు సాధించాడు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది.

పోరాడి ఓడిన బెంగళూరు..

హోమ్ గ్రౌండ్ వేదికగా 288 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు మొదట మంచి ఆరంభమే లభించింది. ఈ క్రమంలోనే ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ మరియు పాఫ్ డూప్లిసిస్ 6 ఓవర్లలోనే జట్టుకు 80 పరుగులు జోడించారు. దీంతో బెంగళూరు ఈసారి ఏదో అద్భుతం చేస్తుంది అనుకునే లోపు హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో బెంగళూరు బ్యాటర్లకు అవకాశం లేకుండా పోయింది.

16 -3

ఈ నేపథ్యంలోనే కింగ్ కోహ్లీ 20 బంతుల్లో 42 పరుగులు చేసి పేవిలియన్ బాట పట్టాడు . అనంతరం 28 బంతుల్లో 62 పరుగులు చేసిన  డూప్లిసిస్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ వరుసగా ఔట్ కాగా , ఈ ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు నుండి మంచి ఫామ్ లో కనిపిస్తున్న దినేష్ కార్తీక్ అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు.

దీంతో బెంగుళూరు జట్టు హోమ్ గ్రౌండ్ వేదికగా నిర్దేశిత 20 ఓవర్లలో 262 పరుగులకే పడిపోయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?