Virat Kohli Wax Statue : విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. మైనపు విగ్రహం ఏర్పాటు..

Virat Kohli Wax Statue : విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. మైనపు విగ్రహం ఏర్పాటు..

Virat Kohli Wax Statue : విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన భారత స్టార్ బ్యాట్స్‌మెన్. మొన్నటి వరకు టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ.. భారత క్రికెట్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఆయన క్రియేట్ చేసిన రికార్డుల గురించి రాయాలంటే ఎన్ని పేజీలు రాసినా తక్కువే.

ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును లీడ్ చేస్తున్న విరాట్ కోహ్లీకి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లోని జైపూర్ లో వ్యాక్స్ మ్యూజియం ఉన్న విషయం తెలుసు కదా. చాలామందికి మేడమ్ తుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం తెలిసే ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియాలు చాలా చోట్ల ఉన్నాయి. ఆ మ్యూజియాల్లో మన భారతీయులకు కూడా చోటు దక్కింది. తాజాగా.. జైపూర్ లోని వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

19 -1

ఇవాళ ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా.. విరాట్ కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విరాట్ కోహ్లీ వ్యాక్స్ స్టాచ్యూను ఏర్పాటు చేసిన అనంతరం.. ఆ విగ్రహాన్ని అందరికీ అనుమతించామని మ్యూజియం డైరెక్టర్ అనూప్ తెలిపారు. 

Virat Kohli Wax Statue : కోహ్లీ విగ్రహాన్ని తయారు చేయడానికి రెండు నెలలు

కోహ్లీ విగ్రహం బరువు 35 కిలోలు ఉంటుంది. ఈ విగ్రహాన్ని రెండు నెలలు కష్టపడి తయారు చేశారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే పలువురు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, కల్పనా చావ్లా, మదర్ థెరిస్సా, అబ్దుల్ కలాం, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండుల్కర్, ధోనీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 

19 -3

తాజాగా కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి కోహ్లీ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయాలని పలువురు పర్యాటకుల నుంచి డిమాండ్లు రావడంతో ఈ సంవత్సరం ఏర్పాటు చేశామని అనూప్ వెల్లడించారు.

ఇండియాలో చాలామంది ప్రముఖులు ఉన్నా కూడా ఎక్కువ మంది పిల్లలు, యూత్.. కోహ్లీ విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ మ్యూజియం జైపూర్ లోని నహార్ ఘర్ ఫోర్ట్ సమీపంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఈ మ్యూజియంలో 44 వ్యాక్స్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కోహ్లీ విగ్రహంతో కలిపి 45 విగ్రహాలు అయ్యాయి. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?