Guntakandla-Jagadish-reddy : కాంగ్రెస్ నాయ‌కుల‌ను గ్రామాలలో తిరగనివ్వం

13న నల్లగొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన‌ జ‌గ‌దీశ్‌రెడ్డి

Guntakandla-Jagadish-reddy : కాంగ్రెస్ నాయ‌కుల‌ను గ్రామాలలో తిరగనివ్వం


Guntakandla-Jagadish-reddy : నల్గొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 10 (క్విక్ టుడే) : కృష్ణా ప్రాజెక్టు తిరిగి రాష్ట్ర పరిధిలోకి లేకపోతే కాంగ్రెస్ నాయ‌కుల‌ను గ్రామాలలో తిరగనియ్యమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం మర్రిగూడ బైపాస్ రోడ్ లో ఈనెల 13న కృష్ణ జలాల సాధన కోసం, నల్లగొండలో నిర్వహించనున్న బి ఆర్ ఎస్ భారీ బహిరంగ సభ స్థలాన్ని నాయకుల‌తో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ దద్దరిల్లేలా ఈనెల 13న సభ నిర్వహిస్తాం అని, ఈ సభకు కేసీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడుతారు అన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేత‌లు దుర్భాశలాడుతున్నార‌ని అన్నారు. రేవంత్ రెడ్డి లాంటోడు ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  గుర్తులు చేరిపేస్తాం అంటున్న రేవంత్ రెడ్డి  నీచ సంస్కృతీ  అర్థం అవుతుంద‌ని అన్నారు. నిజంగానే కేసీఆర్  గుర్తులు ఇవాళ మాయం అవుతున్నాయ‌ని దుయ్య బట్టారు. 24 గంటల కరంట్ కేసీఆర్ గుర్తు, ఇవ్వాళ 24 గంటల కరంట్ మాయం అయింది అని అన్నారు. రైతు బంధు డబ్బులు కేసీఆర్  చిహ్నం.. అది ఇవ్వాళ మాయం చేశారు.. రైతు బంధు డబ్బులు అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు... నిరంతర మంచి నీటి సరఫరా కేసీఆర్  గుర్తు.. ఇవ్వాళ నీళ్లు రావడం లేదు కేసీఆర్ గుర్తు చేరిగిపోయింది..

ఇలాంటి  దొంగల చేతికి ఇవ్వాళ తెలంగాణ పోయింది.. దౌర్భాగ్యం.. అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేయునున్నారు. సభా స్థలాన్ని పరిశీలించిన వారిలో నాయకులు మాజీ ఎమ్మెల్యేలు, గ్యాదరి బాలమల్లు, కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య జీవన్ రెడ్డి సభ సమన్వయకర్త రవీందర్ సింగ్ డాక్టర్ చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్ గౌడ్ మాజీ నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ జెడ్పిటిసీ తండు సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?