MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను శుక్ర‌వారం సాయంత్రం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌)  బృందం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా బీఆర్ ఎస్ పార్టీ శ్రేణుల‌కు ఆందోళ‌న‌కు దిగ‌డంతో పోలీసులు స్వ‌ల్ప లాఠీచార్జి చోటుచేసుకుంది. ఈడి అధికారులు రాత్రి 8.45 గంట‌ల‌కు శంషాబాద్  ఎయిర్ పోర్ట్‌కు తీసుకెళ్లి అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి త‌ర‌లించారు.

ఈడీ జాయింట్ డైరెక్ట‌రేట్ జోగింద‌ర్ నేతృత్వంలోని 12 మంది బృందం ఢిల్లీ బృందం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు చేరుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబ‌ర్ 14లో ఉన్న క‌విత నివాసంలో సోదాలు కొన‌సాగించింది. అక్క‌డే ఉన్న క‌విత భ‌ర్త అనిల్ కుమార్‌తో పాటు మిగ‌తావారి సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఢిల్లీ మ‌ద్యం కేసులో క‌విత మ‌నీలాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

అనంత‌రం ఆమెను అరెస్ట్ చేస్తున్న‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. అరెస్టుకు సంబంధించిన ప‌త్రాల‌ను అంద‌జేసి సాయంత్రం 5.20 గంట‌ల స‌మ‌యంలో ఈడీ బృందం క‌విత‌ను అరెస్టు చేసింది. ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్టు చేస్తున్న‌ట్లు ఈడీ బృందం తెలుప‌డంతో పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు  అక్క‌డికి చేరుకున్నారు.

16

వారు నినాదాల‌తో హోరెత్తించ‌డంతో ఆందోళ‌న‌కు దిగారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్ర‌భుత్వానికి, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ లకు వ్యతిరేకంగా నినా దాల‌తో హోరెత్తించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హరీశ్ రావు స‌హా ప‌లువురు ముఖ్య నేత‌లు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు.

అయితే వారిని ఈడీ అధికారులు గేటు వ‌ద్దే అడ్డుకోవ‌డంతో కార్య‌క‌ర్త‌లు నినాదాల‌తో ఆందోళ‌న‌కు దిగారు. పోలీసు బందోబ‌స్తు పెంచారు. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వ‌చ్చిన‌ప్ప‌డు ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకుని. త్వరగా వస్తానని ఓదార్చింది.

అక్క‌డే ఆం దోళన చేస్తున్న అభిమానులకు న‌మ‌స్క‌రించి అభివాదం తెలిపింది. ప్ర‌త్యేక కాన్వాయ్ ద్వారా ఆమెను శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి తీసుకెళ్లారు. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. రాత్రి 9 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. శ‌నివారం ఆమెను   కోర్టులో  హాజ‌రు ప‌ర్చ‌నున్నారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?