MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో కీలక అప్ డేట్.. ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ అధికారులు

 MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో కీలక అప్ డేట్.. ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ అధికారులు

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలుసు కదా. ప్రస్తుతం ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నారు. కవితను విచారించేందుకు కోర్టును సీబీఐ పర్మిషన్ కోరింది. ఢిల్లీలో ఉన్న రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను లిక్కర్ స్కామ్ కేసులో విచారిస్తామని.. ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేయాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

జైలులోనే కవితను సీబీఐ అధికారులు విచారించనున్నారు. జైలులోకి లాప్ టాప్ తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను విచారించేటప్పుడు మాత్రం ఆమె స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు. వచ్చే వారం కవితను సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. అయితే.. కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు కవిత ఇచ్చిన రూ.100 కోట్లపైనే సీబీఐ అధికారులు కూడా కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

liqor

MLC Kavitha : 2022 లోనే కవితకు సీబీఐ నోటీసులునిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని 2022 డిసెంబర్ లో కవితను సీబీఐ నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తనను విచారించిన అనంతరం.. కవితను తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లోని తన ఇంట్లో అరెస్ట్ చేశారు. 

వెంటనే మార్చి 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. వెంటనే కోర్టు కవిత కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజుల విచారణ అనంతరం కస్టడీని మరో మూడు రోజులకు పొడిగించింది. ఆ తర్వాత మార్చి 26న కవితను విచారించిన అనంతరం మళ్లీ ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను విధించారు. 

mandu

అయితే.. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఓవైపు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కానున్న వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చాలామంది పెద్ద తిమింగలాలనే గాలాలతో లాగేశారు అధికారులు. ఈడీ అధికారులతో పాటు సీబీఐ అధికారులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు.మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కేజ్రీవాల్ ను కూడా తీహార్ జైలులోనే కస్టడీలో ఉంచారు. జైలు నెంబర్ 2 గదిలో ఆయన ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా అదే జైలులో కస్టడీలో ఉన్నారు.దాదాపుగా ఆప్ నేతలంతా జైలులోనే ఉన్నారు. సీఎం కూడా జైలులోనే ఉండటంతో... పాలనను జైలు నుంచే చేస్తామని ఆప్ ప్రకటించింది. జైలు నుంచే సీఎం పాలన చేస్తారని ఆప్ స్పష్టం చేసింది. 

జైలులోనే పలు ఫైళ్లపై అరవింద్ సంతకం పెడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన మీటింగ్స్ లోనూ జైలు నుంచే సీఎం హాజరు అవుతున్నారు. మరోవైపు ఆప్ పార్టీకే చెందిన మరో ఇద్దరు మంత్రులను కూడా ఈడీ విచారిస్తోంది. అంటే.. త్వరలోనే వాళ్లు కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?