క్విక్ టుడే న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ వేడిగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ టీడీపీకి ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతుంది. ప్రతిపక్ష పార్టీ నేతలను టిడిపి ప్రభుత్వం అరెస్టు చేస్తూ వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు వైసిపి ఎమ్మెల్యేలు చేసినా తప్పులను చూపిస్తూ టిడిపి గుణపాఠం తెలుపుతుంది. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నేతలు నోరు పారేసుకున్నారు.
.jpeg)
సోషల్ మీడియాలో ఈ విషయాలను మనం ప్రత్యేకంగా చూసిన వారిమే. కొందరు నేతలు అయితే దారుణంగా ప్రతిపక్ష పార్టీ నేతలను బూతులతో తిట్టుకుంటూ రెచ్చిపోయారు. దీంతో ఆ ఎలక్షన్లలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే అదే బాటలో టిడిపి నేతలు నడవకూడదని.. టిడిపి హై కమాండ్ ఆదేశాలను జారీ చేసింది. పార్టీలోని నేతలకు స్పష్టమైన సూచనలు చేస్తూ ఎలా నడుచుకోవాలో టిడిపి హై కమాండ్ సూచనలు చేస్తుంది. కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆనాడు ఇబ్బందులు పెట్టిన నేతలను ఈనాడు జైలు పాలు చేస్తున్నారు. అయితే టిడిపికి ఇది భవిష్యత్తులో మళ్లీ ముప్పుగా మారుతుందని ఆలోచనతో ... చాలా జాగ్రత్త పడుతుంది. కూటమినేతలకు సంబంధించిన వారు ఎవరైనా కూడా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది టిడిపి. అలాగే వివాదాలకు దూరంగా ఉండాలని సూచనలు చేస్తుంది. పార్టీ లోని ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలని పార్టీ హై కమాండ్ హెచ్చరిస్తుంది.