మిర్యాలగూడ, ఏప్రిల్ 12 (క్విక్ టుడే న్యూస్) టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 వసంతములు పూర్తి చేసుకోని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఏప్రిల్ 27న ఎల్కతురి ఎక్స్ రోడ్డు వద్ద పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన ఛలో వరంగల్ సభను విజయవంతం చేసేందుకు, శనివారం మిర్యాలగూడ పట్టణము లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి తో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 27న మిర్యాలగూడ నియోజకవర్గం అన్నీ గ్రామముల నుండి టౌన్ లోని అన్ని వార్డుల నుండి పెద్ద సంఖ్యలో వరంగల్ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమములో యడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, ఎం.డి.మాక్ధూమ్ పాషా, ఎం.డి.ఇలియాస్ ఖాన్, అయిల వెంకన్న, తలకొల శ్రీధర్ రెడ్డి, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, రమావత్ బీమ్ల నాయక్, యర్రమళ్ళ దినేష్, గుడిసె దుర్గా ప్రసాద్, లింగంపల్లి చీరంజీవి, గుండెబోయిన చందు యాదవ్, శిరసనగండ్ల ఈశ్వర్ చారి, పందిరి వేణు, కొమ్మన పట్టాభి రామ్, చీరు మామిల్ల వేణుగోపాల్ రావు, మండలోజు సైదా చారి తదితరులు పాల్గొన్నారు.
