metal for electric vehicles: సముద్ర గర్భంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ మెటల్.. ఇక చైనా, రష్యాకు పోటాపోటీగా భారత్..
వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయంగా భావించిన సౌర,ఎలక్ట్రిక్ వాహనాలు, వాయు విద్యుత్తు, బ్యాటరీ టెక్నాలజీలో ఈ ఖనిజాల పాత్ర ముఖ్యమైనది. ఈ వారంలో మైనింగ్ లైసెన్సు విధి విధానాలు చర్చించటానికి దానికి సంబంధించిన సభ్య దేశాలు కూడా జమేకాలో సమావేశమయ్యాయి. భారత్ చేసిన కొత్త దరఖాస్తులను ఐఎస్ఏ ఆమోదించినట్లయితే భారత్ కూడా సముద్రంలోని ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ రష్యాతో పాటుగా చైనా కంటే ఒకటి తక్కువగా ఉన్నట్టు అవుతుంది.
హిందూ మహాసముద్రంలో పెద్ద ఎత్తున విస్తరించిన అద్భుతమైన ఖనిజాల నిల్వలు సముద్రంలో అగాధాలను తవ్వి తీయటానికి భారత్ ను ఉసు గొలుపుతున్నాయి. మహాసముద్రంలోని పర్వత ప్రాంతాలలో గల పాలి బెటాలిక్ సల్ఫర్ ను బయటకు తీయటానికి ఇప్పటివరకు ఇండియా, జర్మనీ, సౌత్ కొరియా, చైనా భారతదేశానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మహాసముద్రంలో 5.270 మీటర్ల లోతులో ఖనిజాలు బయటకు తీయటానికి యంత్రాల సామర్థ్యాన్ని కూడా 2022లో పరీక్షించారు.

కొన్ని పాలి మెటాలిక్ నాడ్యూల్స్ బంగాళదుంప ఆకారంలో సముద్ర అడుగున లభించే శిలలు వీటిలో నాణ్యమైన మాంగనీస్, కాపర్ వీటన్నింటినీ సేకరించింది. సముద్ర లోతులో ఖనిజాల బయటికి తీయటానికి భారత ప్రణాళికకు సంబంధించిన ప్రశ్నలకు స్పందించడం లేదు. భారత్ తన సొంత హక్కుల విషయంలో ఎంతో శక్తివంతంగా ఉంటుందో చాటి చెప్పాలని భావించింది. అలాగే లోతైన సముద్ర జలాల్లో ఖనిజాల అన్వేషణ చెయ్యనంత మాత్రాన మేము వెనకబడలేదు అని చెప్పటానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది.
సముద్ర గర్భంలో తవ్వకాలు భూమిపై చివరి ఆప్షన్. ఖనిజాల తవ్వకం మానవాళిని కోలుకోలేని నష్టం కలిగిస్తుందని పర్యావరణ శాఖ తెలియజేసింది. దీని గురించి సమాచారం లేకపోవటం వల్ల తవ్వకాలను ఆపటానికి తాత్కాలికంగా విరామం ప్రకటించటం జరిగింది. యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా దాదాపు 20 కి పైగా దేశాలు డిమాండ్ చేశాయి. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ డిమాండ్ ను అందుకోవడానికి 2050 నాటికి ప్రత్యేకమైన ఖనిజాల తవ్వకం 5 రేట్లు పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
భారత్ తనకు ఉన్న ఇంధన అవసరాలలో సగం భాగాన్ని పునరుత్పాదక శక్తి ద్వారా తీర్చడానికి వీలుగా 2030 నాటికి 500 గిగా వాట్స్ పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయటానికి స్వల్ప కాలిక లక్ష్యాన్ని పెట్టుకుంది. అంతే 2070 నాటికి కర్బన ఉద్గాలను స్థాయిలోకి చేర్చాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. సముద్రాల లోతుల్లో ఖనిజాలు బయటకు తీయటానికి సమర్ధించినవారు భూమిపై ఖనిజాల తవ్వకం గరిష్ట స్థాయికి చేరుతుందని తెలిపారు. దానివల్ల నాసిరక ఖనిజాల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. అంతేకాక ఎన్నో ఖనిజ వనరుల ప్రాంతాలు పర్యావరణ సమస్యలు పడతాయని తెలిపింది.
ప్రస్తుత అవనిలో ఖనిజాలు బయటికి తీయటానికి కొన్ని దేశాలు ఆధిపత్యం చాటాయి. లిథియం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా,కాపర్ ఉత్పత్తిలో చైనా,గ్రాఫైట్,స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగించటానికి రేర్ ఎర్త్ మూలకాల ఉత్పత్తిలో కూడా ఆధిపత్యం చూపుతున్నారు. ఖనిజాల శుద్ధిలో చైనా ఆధిపత్యంపై భౌగోళిక, రాజకీయ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ రెన్యువల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం దశాబ్దాల తరబడి ఖనిజాలను శుద్ధి చేసే విషయంలో చైనాకు ఇంతవరకు ఎదురులేరు.
కోబాల్ట్ పై 70 శాతం శుద్ధి చేసిన లిథియం,మాంగనీస్ దాదాపు 60 శాతం ఆధిపత్యం కలిగి ఉంది అని తెలిపారు. దీనికి తోడుగా ప్రస్తుతం కొన్ని ప్రాసెసింగ్ టెక్నాలజీల పై బీజింగ్ నిషేధిస్తుంది.ఈ రంగంలో చైనా ఆధిపత్యానికి అమెరికా ఎన్నో పశ్చిమ దేశాలు ఖనిజ భద్రత భాగస్వామ్యాన్ని 2022లో మొదలుపెట్టింది. కీలక ఖనిజాల సరఫరా పెట్టుబడులకు ఈ భాగస్వామ్యం ఉత్పారకంగా నిలిచింది. ఇప్పుడు ఇండియా కూడా ఇందులో భాగస్వామిగా ఉంది.
లోతైన సముద్ర గర్భ మైనింగ్ లో అభివృద్ధి చేయటానికి రష్యా ఒక ఒప్పందంపై ఇండియా సంతకం చేసింది. పెరుగుతున్న ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కీలక ఖనిజాలను బయటకు తీసి,శుద్ధి చేసి వినియోగించటానికి వేగంగా పనులు చేస్తున్నట్లు పిరాక్సిన్ తెలిపారు.