Online Shoping Fraud :  ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు చేయరు...

Online Shoping Fraud :  ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు చేయరు...

Online Shoping Fraud :  దేశంలో డిజిటల్ లావాదేవీలు చాలా బాగానే పెరిగిపోయాయి. టెక్నాలజీ మనకు అందుబాటులో రావటం వలన ఈ పద్ధతిలో పనులన్నీ కూడా చాలా సులువుగా జరిగిపోతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండానే అన్ని పనులు  చేసుకునే వీలు ఉంది. మనం ముందు ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం లో చేరాల్సి ఉంటుంది.

తరువాత దాని ద్వారా లావాదేవీలు జరుపుకోవాలి.ఈ ఫ్లాట్ ఫాం లో ఎన్నో రకాల డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లు అందిస్తారు. వివిధ రకాల ఉత్పత్తులపై తగ్గింపు మరియు రివార్డులను కూడా అందిస్తారు. కానీ వాటిలో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి అని ఇటీవల సర్వేలో తేలింది..

ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్ ఫాం లు ప్రకటించిన క్యాష్ బ్యాక్ లు, సబ్స్క్రిప్షన్ రివార్డులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.వాటిని చూసిన వెంటనే చాలా మంది వాటిలో సభ్యులుగా చేరతారు. అక్కడ చూపించిన వస్తువులన్నిటినీ కూడా షాపింగ్ చేసేస్తారు. అయినా కూడా వారికి క్యాష్ బ్యాక్ లు, రివార్డులు రావడం లేదు.ఇలా కొన్ని ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్ ఫాం లు కొనుగోలుదారులను మోసం చేస్తున్నాయని తెలిసింది.

147 -2

ఆన్ లైన్ చెల్లింపు ఫ్లాట్ ఫాం లో అందిస్తున్న క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆకర్షితులవుతున్నారు. క్యాష్ బ్యాక్ ఆఫర్లను చూసిన తర్వాత నిర్దిష్ట ఉత్పత్తులను కొనుక్కుంటున్నారు.కానీ వాటిపై ఇచ్చినటువంటి క్యాష్ బ్యాక్ రివార్డులు మాత్రం వాళ్ళకి రావటం లేదు అని ఇటీవల సర్వేలో తేలింది.

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ 13 రకాల తప్పుదారులను పట్టించే ప్రకటనలు కొనుగోలుదారుల హక్కులను ఉల్లంఘించె అన్యాయమైన వాణిజ్య పద్ధతులను తెలిపింది వాటిలో హిడేన్ ఛార్జీలు, ఫాల్స్ అర్జెన్సీ, బాస్కెట్ స్నీకింగ్, సబ్ స్క్రిప్షన్ క్యాష్ బ్యాక్ లు, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ యాక్షన్, సబ్ స్క్రిప్షన్ ట్రాప్, ఇంటర్ పేస్ ఇంటర్ పరెన్స్, డ్రీప్ ప్రెపింగ్, టిక్ ప్రశ్నలు ఇతర విధానాలు కూడా ఉన్నట్లుగా తేలింది.వీటి ద్వారానే పలువురు కొనుగోలుదారులు మోసపోతున్నట్లుగా తెలిపింది..

ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో దీనికి సంబంధించిన ప్రకారం దాదాపుగా 45 వేల మంది తన అభిప్రాయాలను తెలిపారు. హిడెన్ చార్జీల కు సంబంధించిన 52 శాతం మంది ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. మరో 67% మంది సబ్ స్క్రిప్షన్ ట్రాప్ లో పడ్డారు.మోసపూరిత  బైట్ అండ్ స్విచ్ సమస్యలను కూడా దాదాపుగా 62 శాతం మంది ఎదుర్కోనారు.

147 -3

దీనిలో కొనుగోలుదారులు ఎక్కువ చెల్లింపులు చేయటం కోసం ఎక్కువగా క్యాష్ బ్యాక్ లు అందిస్తుంటారు.కానీ ప్రోత్సాహం ఎప్పుడు కూడా చెల్లించరు. భారత ప్రభుత్వం 2023 డిసెంబర్ లో కొనుగోలుదారుల మోసం చేసే ఈ పద్ధతులు చట్ట విరుద్ధం అని తెలిపింది.

ఈ చీకటి పద్ధతుల వలన కస్టమర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే ఆన్ లైన్ పేమెంట్ ఫ్లాట్ ఫాం పై రూ.10 లక్షలు జరిమానా విధిస్తున్నట్లుగా ప్రభుత్వం హెచ్చరించింది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?