RBI 2000 notes : బీ అలర్ట్... 2000 నోట్లపై కీలక అప్డేట్...

RBI 2000 notes : బీ అలర్ట్... 2000 నోట్లపై కీలక అప్డేట్...

Be Alert RBI  update on 2000 notes... :  దేశంలో 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకున్నట్లు గతంలో ప్రకటన చేసింది. దానికి సంబంధించిన గడువు కూడా ఇచ్చింది. పెద్ద నోట్లు ఉన్న వాళ్లంతా బ్యాంక్ కు వెళ్లి మార్చుకున్నారు. ఈ 2000  నోట్లు ముద్రించటం కూడా నిలిపివేసినట్లుగా RBI గతంలో తెలిపింది. 2000 నోట్లు ఉన్నవాళ్లు ఇప్పటివరకు బ్యాంకుకు వెళ్లి మార్పిడి చేసుకున్నారు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటుపై ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు రద్దు చేయబడిన 2000 కరెన్సీ నోటు మార్పు పై అత్యవసర అప్డేట్ RBI ఇచ్చింది.ఏప్రిల్ 1వ తేదీ 2000 నోట్లు మార్పిడి సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా ప్రకటించింది. తమ 19 కార్యాలయాల్లో కూడా ఈ సేవలు నిలిపివేసినట్లుగా ప్రకటించింది. పాత ఆర్థిక సంవత్సరం ముగిసి, కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో అకౌంట్స్ బిజీ వర్క్ దృశ్య ఈ నిర్ణయాలు తీసుకున్నారు..

rbi

మళ్లీ ఏప్రిల్ 2 నుండి 2000 నోట్లు మార్పిడి యధావిధిగా జరుగుతుంది.పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ద్రవ్యలభ్యతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లో ను ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత పోయిన సంవత్సరం వీటిని కూడా చాలామనీ నుండి RBI ఉపసంహరించింది. 2023 మే 19న ఈ ప్రకటన వెలువడింది.నోట్లను డిపాజిట్ చేసేందుకు లేక బ్యాంకులో మార్చటానికి 2023 సెప్టెంబర్ 30వ తారీకు వరకు చివరి గడువు ఇచ్చింది.

దీన్ని తరువాత 2023 అక్టోబర్ 7 వరకు మళ్లీ గడువు పోడిగించింది.దాని తర్వాత అక్టోబర్ 8 నుండి RBI కి చెందిన 19 రిజినల్ ఆఫీస్ లో కరెన్సీని మార్చటానికి లేదా బ్యాక్ అకౌంట్ లో జమ చేయటానికి అవకాశం కల్పించింది. చలామణి నుండి ఉపసంహరించినప్పటి నుండి కూడా 2000 నోట్లు భారీ స్థాయిలో బ్యాంకులకు చేరాయి. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 97.38% నోట్లు రిటర్న్ చేశారు. ఇంకా ప్రజల వద్దరూ.8,470 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి

notes

అయితే రూ.2,000 బ్యాంకు నోట్లు ఇప్పటికీ లీగల్ టెండర్ గా  కొనసాగుతున్నాయని తెలిపింది. వీటిని మొత్తం మూడు మార్గాలలో మార్చుకోవచ్చు అని తెలిపింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రూ.2,000 బ్యాంకు నోట్లు చలామణి నుండి ఉపసంహరించిటప్పటి నుండి అవి లీగర్ టెండర్ గా కొనసాగుతూనే ఉన్నాయి. మీ దగ్గర గనక రూ.2000 నోట్లు ఉన్నట్లయితే, వాటిని వెంటనే RBI ఆఫీసులో డిపాజిట్ చేయాలి..

దేశవ్యాప్తంగా ఉన్న 19 RBI ఆఫీస్ లో ఈ సౌకర్యం ఉన్నది. అక్టోబర్ 8, 2023 తర్వాత 2000 నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం RBI తొలగించింది. దీని తర్వాత నోట్ల మార్పిడికి బదులుగా RBI ఆఫీస్ లో వీటిని డిపాజిట్ చేసి ఆ మొత్తాన్ని కూడా తమ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేసే అవకాశం తీసుకొచ్చింది. దేశంలో 19 ప్రధాన నగరాలలో ఆర్బిఐ రీజనల్ ఆఫీసులో ఉన్నాయి. బేలాపూర్, అహ్మదాబాద్,బెంగళూరు, బోపాల్, భువనేశ్వర్,చెన్నై, చండీగఢ్, గౌహతి, హైదరాబాద్,జమ్మూ,జైపూర్, కాన్పూర్,లక్నో,ముంబై,కోల్ కత్త,నాగపూర్, తిరువనంతపురంలోని RBI కార్యాలయంలో బ్యాంకు నోట్లను డిపాజిట్ ఎక్సేంజ్ చేయవచ్చు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?