UPI Apps : జనాల జేబులకు చిల్లు పెడుతున్న యూపీఐ యాప్స్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు..!

UPI Apps : జనాల జేబులకు చిల్లు పెడుతున్న యూపీఐ యాప్స్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు..!

UPI Apps : ప్రస్తుత కాలంలో ప్రతిదీ కూడా ఆన్ లైన్ లో జరుగుతున్నది. అగ్గిపెట్ట దగ్గర నుండి వాషింగ్ మిషన్ల వరకు కూడా ప్రతి దానిని ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇక యూపీఐ యాప్స్ వినియోగం పెరిగిన తరువాత చేతిలో డబ్బులు పట్టుకు తిరగటం చాలా వరకు తగ్గిపోయింది. రోడ్డు పక్కన దుకాణాలు మొదలుకొని పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా ఎక్కడ చూసినా ఫోన్ పే,గూగుల్ పే, పేటియం లాంటి యూపీఐ  యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ ను తీశామా. స్కాన్ చేసామా. పేమెంట్ చేసామా. అంతే సంగతి. ఎటువంటి  చిల్లర సమస్య లేదు. దొంగ నోట్ల ప్రసక్తి అస్సలు లేదు.  అయ్యో ఇంటి దగ్గరే పర్సు మర్చిపోయామే, డబ్బులు కూడా తేలేదు అనే ఇబ్బంది కూడా లేదు. యూపీఐ చెల్లింపుల వలన కొనుగోలు చాలా సౌకర్యవంతంగా అయ్యాయి అని చెప్పవచ్చు.

దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు యూపీఐ చెల్లింపుల వ్యవస్థను స్వీకరిస్తూ ఉన్నారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే అంటున్నారు. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడం వలన నగదు లావాదేవీలను కూడా చాలా సులభతరం చేసింది. దీనితో పాటుగా ప్రజలు తమ డబ్బులు ఖర్చు చేసే విధానం పై భారీ ప్రభావాన్ని చూపుతున్నట్లుగా నివేదిక తెలిపింది.

155 -2

అయితే ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే. యూపీఐ యాప్స్ జనాల జేబు లకు చిల్లు పెడుతున్నాయి అంటూ షాకింగ్ విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయ.. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ అనే సంస్థ భారత దేశంలో యూపీఐ చెల్లింపులపై చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు కొన్ని బయటకు వచ్చాయి.

అయితే ఈ  నివేదికలో యూపీఐ మరియు ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ నగదు బదిలీ ప్రక్రియను మునుపటి కంటే చాలా సులభం చేసింది అని ఎంతో మంది ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అంట. ఇది ఒక వైపు మాత్రమే అని మరోవైపు ఈ యూపీఐ యాప్స్ వలన డబ్బు ఖర్చు చేసే నియమంలో జనాలు కంట్రోల్ ఉండటం లేరు అనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గతంలో అయితే బయటకు వెళ్తే ఖర్చులకు సరిపడా డబ్బులు మాత్రమే పట్టుకొని వెళ్లేవారు. ఎంత నగదు తీసుకెళ్లామో అంత మేర లేదంటే ఇంకా తగ్గించి ఖర్చు చేసుకొని వచ్చేవాళ్లు. కానీ యూపీఐ పేమెంట్స్ పెరగటంతో ఈ కంట్రోలింగ్ విధానం అనేది దెబ్బతిన్నది. మనసుకు నచ్చినవన్నీ కొనుగోలు చేసి స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్న దాంతో ఖర్చుల మీద కూడా అదుపు అనేది లేకుండా పోతుంది.

155 -1

దీని ఫలితంగా యూపీఐ చెల్లింపుల వలన ప్రజల అవసర ఖర్చులు కంటే అనవసర ఖర్చులు ఎక్కువ చేస్తున్నట్లుగా నివేదిక తెలిపింది.. ఈ తాజా అధ్యయన ప్రకారం చూసుకుంటే. యూపీఐ మరియు ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను వాడటం వలన భారత దేశంలో 75 శాతం మంది ప్రజలు ఎక్కువ ఖర్చు చేశారు అని తెలిపింది.

సర్వే ప్రకారం దాదాపుగా 71 శాతం మంది వ్యక్తులు రోజువారి యూపీఐ యాప్స్ వలన లావాదేవీలు చేస్తున్నట్లుగా తెలిపింది. అలాగే యూపీఐ వల్ల చెల్లింపులు సులభంగా మారాయి అని 91.5% మంది ప్రజలు తెలిపారు. ఇదే తరుణంలో వ్యక్తులు యూపీఐ ద్వారా సగటు రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపింది.

ఏప్రిల్ మాసంలో యూపీఐ లావాదేవీల సంఖ్య దేశంలో ఒకటి 1,330 కోట్లకు చేరింది. ఏడాది ప్రతిపదికన యూపీఐ లావాదేవీల సంఖ్య 50 శాతం వరకు పెరిగింది. యూపీఐ యాప్స్ వలన ప్రయోజనాల సంగతి పక్కన పెడితే జనాల చేత విపరీతంగా ఖర్చు చేయిస్తు జేబుకు చిల్లులు కూడా పెడుతుంది అని నివేదిక తెలిపింది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?