Chiranjeevi: రచ్చ గెలిచి.. ఇంట గెలిచానని చిరంజీవి భావోద్వేగం.. ఆయ‌న ప్ర‌సంగాని అంద‌రూ ఎందుకు ఫిదా అయ్యారంటే.. 

Chiranjeevi: రచ్చ గెలిచి.. ఇంట గెలిచానని చిరంజీవి భావోద్వేగం.. ఆయ‌న ప్ర‌సంగాని అంద‌రూ ఎందుకు ఫిదా అయ్యారంటే.. 

Chiranjeevi: సినీ రంగ పరిశ్రమలో చిరంజీవి తన సొంత కాళ్ళ మీద నిలబడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడంటే కచ్చితంగా అతని యొక్క కృషి,పట్టుదల మాత్రమే అని చెప్పాలి. ఈరోజు ఇంతమంది యువ హీరోలు మెగా ఫ్యామిలీ లో ఉన్నారంటే దానికి కచ్చితంగా కారణం చిరంజీవి అని చెప్పాలి. ఒక చిరంజీవి కష్టపడి పైకి ఎదగడం వల్ల ఈరోజు రెండు మూడు తరాలను కూడా అతను సులభంగా సినీ రంగంలో నిలబెట్టాడంటే అర్థమవుతుంది అతను ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడు. 

అయితే ప్రస్తుతం సినీ రంగంలో తాను రచ్చ గెలిచి ఇంట గెలిచానని వ్యాఖ్యానించారు మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు నందుకోవడంతో తాను ఇంట గెలిచారని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఈ వజ్రోత్సవాల సందర్భంగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకొని చిరంజీవి తీవ్రంగా భావోద్వేగానికి ఎన్నడూ లేనటువంటి విధంగా గురయ్యారు. 

సోమవారం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలు నిర్వహించిన వేడుకలు అక్కినేని నాగేశ్వరరావు జాతి అవార్డును ఆయన అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక 2024 సంవత్సరానికి గాను అవార్డును చిరంజీవి ప్రధానం చేశారు. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకోవడం కూడా అటు చిరంజీవికి అలాగే చిరంజీవి అభిమానులు కూడా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. 

30 02
ఇకపోతే అమితాబచ్చన్ చిరంజీవి గురించి చాలా మంచిగా మాట్లాడారు. చిరంజీవి మరియు నాగార్జున అలాగే నాగస్విని వంటి వారు నన్ను తెలుగు సినిమాల్లో  మంచి గుర్తింపుతో ఒక హీరోగా నిలబెట్టారని చెప్పుకొచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఒక సభ్యుడు నేను అని గర్వంగా చెప్పుకుంటూ తెలుగు చిత్రశ్రమలు నన్ను ఓ భాగంగా పరిగణించండి అంటూ అలాగే ఇండియన్ సినిమాలకు అక్కినేని నాగేశ్వరావు చేసినటువంటి సేవలు చెప్పుకోలేనటువంటివి అని చిరంజీవి నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదనకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి ప్రేమ అలాగే అభిమానానికి నేనెప్పుడూ కూడా రుణపడి ఉంటానని అమితాబచ్చన్ చెప్పుకొచ్చాడు. 

ఇక చిరంజీవి అమితాబచ్చన్ గురించి కూడా చాలా మంచిగా మాట్లాడాడు. అమితాబచ్చన్ నా గురువు ఒక స్ఫూర్తిదాయ‌మైన వ్యక్తి అని నాకు అవార్డు వచ్చిన తరువాత ఆయన నుంచి శుభాకాంక్షలు అందుతాయని అసలు అనుకోలేదని చెప్పాడు. పద్మభూషణ్‌ అవార్డు ద‌క్కిన‌ప్పుడు నిర్వ‌హించిన సన్మాన కార్యక్రమంలో అమితాబచ్చన్  " చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా" అని మాట్లాడిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు నా జీవితంలో మర్చిపోలేనివ‌ని చెప్పారు. 

ఆయన మాటలు చాలా స్ఫూర్తినిచ్చాయని చెప్పుకొచ్చారు. నీకు అలాగే ఇండియన్ సినిమాకు బాద్ షా అయినటువంటి అమితాబ్ నుంచి అవార్డు స్వీకరించడం అనేది చాలా గర్వంగా ఉందని చిరంజీవి అన్నారు. తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఓనాడు నా మదిలో ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇంట గెలిచానని అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంట గెలిచే అవకాశం తెలుగు సినిమా వద్దురా ఉత్సవాల సమయంలో వచ్చింది. నాకు అప్పుడు లెజెండ్రీ పురస్కారం  ప్రధానం చేశారు. 

30 01
కానీ కొన్ని అనుకూల పరిస్థితుల వల్ల కొందరు వ్యక్తులు ఆశించిన కారణంగా ఆ పురస్కారాన్ని తీసుకోవడం  సరైనదిగా అనిపించలేదు. అందుకే ఆరోజు అవార్డుని ఓ క్యాప్సిల్ బాక్స్ లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటానని చెప్పాడు. ఆరోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ది గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డును ది గ్రేట్ అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా అందుకున్న కాబట్టి ఇప్పుడు నేను ఇంట‌ గెలిచాను... రచ్చ గెలిచాను అనిపిస్తుందని భావోద్వేగానికి గురవుతూ చెప్పాడు చిరంజీవి. 

 ఇక ఈ ఫిలిం స్టూడియోలోనే అక్కినేని నాగార్జున కూడా అమితాబచ్చన్ గురించి అలాగే చిరంజీవి గురించి చాలా మంచి వాక్యాలు చేశారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులను గౌరవించడమే ఏఎన్ఆర్ అవార్డు ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. ఈరోజు ఈ వేదికపై ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు ఉన్నారని వాళ్లు ఈ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని పై స్థాయికి తీసుకెళ్తున్నారని   చెప్పుకొచ్చాడు. 

వాళ్లు మరెవరో కాదు బిగ్ బి అమితాబచ్చన్ అలాగే మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది ఏఎన్ఆర్ పురస్కారాన్ని నా మిత్రుడు పద్మ విభూషణం చిరంజీవి అందిస్తున్నందుకు మా కుటుంబ సభ్యులందరూ గర్విస్తున్నామని అలాగే ఆనందిస్తున్నామని చెప్పుకొచ్చాడు. అలాగే దీన్ని మేము అందరం ఎంతగానో ఆరాధించే పద్మ విభూషణ్ అమితాబచ్చన్ గారు ప్రజెంట్ చేయడం అనేది ఈ వేడుకకు మరొక ప్రత్యేకమని చెప్పుకొచ్చారు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?