SS Rajamouli : ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోయిన్ చనిపోవాలని కథ రాసుకున్న రాజమౌళి.. ఆ తర్వాత ఎందుకు స్టోరీ మార్చారంటే?

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోయిన్ చనిపోవాలని కథ రాసుకున్న రాజమౌళి.. ఆ తర్వాత ఎందుకు స్టోరీ మార్చారంటే?

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సినిమా చూశారా మీరు? మీరే కాదు.. ఈ ప్రపంచమంతా ఆర్ఆర్ఆర్ సినిమాను చూసింది. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. వీళ్ల సరసన హీరోయిన్ గా ఓలివియా మోరిస్, అలియా భట్ నటించారు. జూనియర్ కు సరసన ఓలివియో నటించగా.. రామ్ చరణ్ కు జోడిగా ఆలియా భట్ నటించింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై వేల కోట్లను కొల్లగొట్టింది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ సినిమాతో పోల్చితే ముందు ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేయాలని డైరెక్టర్ రాజమౌళి భావించారట. తర్వాత ఎందుకో ఆ స్టోరీ వద్దని.. చివరకు స్టోరీని  మార్చేశారట. ఈ విషయాలన్నీ డైరెక్టర్ జక్కన్ననే స్వయంగా చెప్పుకొచ్చారు. 

ఈ సినిమాను ఇండియాలోని అన్ని భాషల్లో విడుదల చేశారు. విదేశీ భాషల్లోనూ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాను జపాన్ లో విడుదల చేయగా.. ఆ మూవీ ప్రమోషన్ కోసం డైరెక్టర్ రాజమౌళి జపాన్ వెళ్లారు. అక్కడ మీడియాతో ఓ కొత్త విషయాన్ని షేర్ చేసుకున్నారు. 

201 -1

SS Rajamouli : జెన్నీ పాత్రలో నటించిన ఓలివియాను చంపేయాలని అనుకున్న రాజమౌళి

ఈ సినిమాలో జెన్నీ పాత్ర చాలా కీలకం. బ్రిటీష్ యువరాణి పాత్ర జెన్నీగా ఓలివియా మోరిస్ నటించింది. ఎన్టీఆర్ కు ఆమె జోడిగా నటించింది. వీళ్లిద్దరి మధ్య చాలా సన్నివేశాలను చిత్రీకరించారట. కానీ.. అప్పటికే సినిమా మూడు గంటలు దాటడంతో కొన్ని తీసేసినట్టు రాజమౌళి చెప్పారు. 

జెన్నీని ఉపయోగించుకొని మల్లి ఎక్కడుందో తెలుసుకుంటాడు భీమ్. కానీ.. ఆ తర్వాత స్టోరీ వేరే ఉంటుంది. భీమ్ ను జైలులో పెట్టిన తర్వాత ఆ విషయం జెన్నీకి తెలిసి అతడిని కలవడం కోసం వెళ్తుంది. ఎలాగైనా భీమ్ ను జైలు నుంచి తప్పించడం కోసం జైలు నుంచి తప్పించుకునే ప్లాన్స్ ను తీసుకెళ్లి భీమ్ కు ఇస్తుంది జెన్నీ. భీమ్ ను కలిసి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. గవర్నర్ స్కాట్ భార్య చూసి ఏమైందని అడుగుతుంది. ఇంతలో భీమ్ తప్పించుకొని పారిపోతాడు. 

కట్ చేస్తే భీమ్ తప్పించుకొని పారిపోయాడని.. రామ్ గురించి అసలు విషయం తెలిసి రామ్ ను జైలులో పెడతారు బ్రిటీష్ పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న భీమ్.. తిరిగి జైలుకు వస్తాడు. రామ్ ను కాపాడి జైలు నుంచి బయటికి తీసుకెళ్తాడు. 

అయితే.. బ్రిటీష్ సైన్యాన్ని చంపుకుంటూ ఇద్దరూ అడవిలోకి వెళ్తారు. అయితే.. వీళ్లిద్దరినీ పట్టుకోవడం కోసం జెన్నీని పావుగా వాడుకొని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ అనుకుంటాడు. వాళ్లను వెంటనే లొంగిపోవాలని.. లేకపోతే జెన్నీని చంపేస్తానని స్కాట్.. ఇద్దరు భీమ్, రామ్ ను బెదిరిస్తాడు. దీంతో జెన్నీ కోసం ఇద్దరూ లొంగిపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. స్కాట్ మాత్రం భీమ్ తప్పించుకోవడానికి జెన్నీ సాయం చేసిందన్న కోపంతో జెన్నీని స్కాట్ చంపేస్తాడు. 

201 -2

ఇది అసలు కథ. కానీ.. ఇది చివరకు విషాదంతో ముగుస్తుంది అని ఆలోచించిన రాజమౌళి.. కథను మొత్తం మార్చేశారట. అందుకే జెన్నీని చంపకుండా వదిలేశారు.. అంటూ రాజమౌళి జపాన్ లో ఈ సినిమా కథలోని మార్పులను షేర్ చేసుకున్నారు. 

ఇక.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తన తదుపరి సినిమాను తీస్తున్నారు. ఈ మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగుతుంది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీ కోసం మహేశ్ కూడా రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?