medipally : క‌ల్తీ మిక్స‌ర్‌, బూందీ త‌యారీ కేంద్రంపై దాడి

medipally : క‌ల్తీ మిక్స‌ర్‌, బూందీ త‌యారీ కేంద్రంపై దాడి

మేడిప‌ల్లి, క్విక్ టుడే :  మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా మేడిప‌ల్లి పీఎస్‌ ప‌రిధిలో క‌ల్తీ మిక్స‌ర్‌, బూందీ త‌యారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మేడిప‌ల్లి ఇన్‌స్పెక్ట‌ర్ ఆర్‌. గోవింద‌రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పీర్జాదిగూడ‌లోని శ్రీసాయి న‌గ‌ర్ కాల‌నీలో ఎలాంటి ప్ర‌భుత్వ‌ అనుమ‌తి తీసుకోకుండా క‌ల్తీ మిక్స‌ర్‌, బూందీ త‌యారు చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందింది. దీంతో మేడిప‌ల్లి ఆఫీస‌ర్స్ సిబ్బందితో క‌లిసి మిక్స‌ర్ త‌యారీ కేంద్రంపై దాడి చేశారు.

అధికారుల‌ సోదాల్లో 300 ప్యాకెట్లు మిక్స‌ర్, 200 కిలోల బూందీ, 20 కిలోల ప‌చ్చి బ‌ఠానీ, 50 కిలోల దాల్‌మోటి, 15 కిలోల పెస‌ర‌, 20 కేజీలు మ‌సాల ప‌ల్లీలు, 20 కిలోల గుర్ర‌పు ప‌ప్పు, 5 కిలోల రాక్ సాల్ట్, 250 గ్రాముల గ్రీన్ క‌ల‌ర్ వంటి త‌యారీ ప‌దార్థాల‌ను గుర్తించారు. క‌ల్తీ మిక్స‌ర్ త‌యారీ నిందితుడు ఉప్ప‌ల్ చెందిన ఆంటోని అరుల్ శీల‌న్ ప‌ట్టురాజ్ అలియాస్ ప‌ట్టురాజ్‌ (57) ను అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమ‌తి లేకుండా సుల‌భంగా డ‌బ్బులు సంపాదించేందుకు అక్ర‌మంగా వ్యాపారాన్ని ప్రారంభించి క‌ల్తీ ఉత్ప‌త్తుల‌ను దుకాణాలు, బేక‌రీల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు పోలీసుల‌ ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు సీఐ ఆర్ గోవింద‌రెడ్డి తెలిపారు. ఎవ‌రైనా ఇలాంటి క‌ల్తీ మిక్స‌ర్ లాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆయ‌న‌ హెచ్చ‌రించారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?