fire in Ujjain temple: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం

fire in Ujjain temple: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం

fire in Ujjain Maha Kaleshwar temple: భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోలీ పర్వదినం సందర్భంగా ప్రధాన గోపురం కింద ఉన్న గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జ‌రుగుతున్న సంద‌ర్భంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయంలో స్వామికి గులాల్‌ను సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెల‌రేగాయి.  అక్కడే ఉన్న ఓ వ‌స్త్రానికి మంట‌లు అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. వెంట‌నే క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స‌లు అందిస్తున్న‌ట్లు కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

257 -1

వీరిలో ఆరుగురి పరిస్థితి విష‌మంగా ఉండటంతో ఇండోర్ కు‌ తీసుకెళ్లిన‌ట్లు తెలిపారు. బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజయ్‌ గౌర్‌ కూడా ఉన్న‌ట్లు తెలియ‌జేశారు.  ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ఆలయంలో హోలీ వేడుకలు కొన‌సాగుతుండ‌గా ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుమారుడు, కుమార్తె త్రుటిలో బయటపడ్డారు.

ఈ ఘటన జరిగిన ప్రదేశానికి ద‌గ్గ‌ర‌లోనే వారు కూడా ఉన్నారు. "ఈ ప్రమాదంలో 14 మంది పూజారులు తీవ్రంగా గాయపడిన‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై జిల్లా పంచాయతీ సీఈవోతో పాటు అదనపు కలెక్టర్ నేతృత్వంలో  విచారణ కొన‌సాగుతోంది. మూడు రోజుల్లో దీనిపై ఓ నివేదిక తయారు చేస్తామ‌ని తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో కొంత మంది వీవీఐపీలు, భక్తులు ఉండ‌గా, వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు.

257 -2

కాగా ఆలయ సిబ్బంది, పూజారులు మాత్రమే ప్ర‌మాదంలో గాయపడ్డారు. ఈ ప్ర‌మాద‌ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందిస్తూ.. ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. "ఈ ప్రమాదంలో గాయ‌ప‌డిన పూజారుల‌ను ఇండోర్, ఉజ్జెయిన్‌లోని హాస్పిటల్స్‌కి తరలించి మెరుగైన‌ చికిత్స అందిస్తున్నాం.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన‌ట్లు, బాధ్యులను కచ్చితంగా శిక్షిస్తామ‌ని ముఖ్య‌మంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై కేంద్రహోం మంత్రి అమిత్ షా గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో మాట్లాడారు. బాధితులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు X లో పోస్ట్ చేశారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?