Phone tapping : ఫోన్ టాపింగ్ కేసులో మరో ముఖ్యమైన వ్య‌క్తికి నోటీసులు జారీ....

 Phone tapping  : ఫోన్ టాపింగ్ కేసులో మరో ముఖ్యమైన వ్య‌క్తికి నోటీసులు జారీ....

Phone tapping : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ టాపింగ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువస్తుంది. అయితే మొన్నటి వరకు ప్రతిపక్ష నేతలు వారి బంధువులు అలాగే కొందరి వ్యాపారుల ఫోన్లు మాత్రమే చాటింగ్ కు గురయ్యాయనే ఆరోపణలు రాగా ...ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.

ఈ నేపద్యంలోనే ఈ కేసులో నిందితులను విచారించగా టాస్క్ ఫోర్స్ అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా పోలీస్ వాహనాలలోనే ఓ ప్రధాన పార్టీకి చెందిన వారు డబ్బులు తరలించినట్లుగా తెలిసింది.అయితే టాస్క్ ఫోర్స్ అధికారాన్ని  ఉపయోగించుకుంటే వాహనాలలో ఎలాంటి తనిఖీలు చేపట్టరు అనే ఉద్దేశంతోనే  కొందరు ముఖ్య నేతలు ఈ విధంగా డబ్బులు తరలించినట్లు సమాచారం.

ఇక దీనిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో కొంతమంది రాజకీయ ప్రముఖులకు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగినట్లయితే ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో మరింత సంచలనం సృష్టిస్తుందని చెప్పాలి.

014 -3

అయితే ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ డిఎస్పి ప్రణీత్ రావు తో పాటు ఎస్పీలు భుజంగరావు , తిరుపతన్న లను అరెస్టు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అనంతరం మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. అయితే రాధా కిషన్ రావుని విచారించి  పోలీసులు ఇటీవల నాంపల్లి న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా ఈరోజు మధ్యాహ్నం దీనిపై విచారణ జరగనుంది.

ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం కస్టడీకి అనుమతిస్తే రాధా కిషన్ నుండి మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కనిపిస్తున్న ఇంటిలిజెన్స్ మాజీ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈరోజు ఆయన హైదరాబాద్ కు వస్తున్నారని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభాకర్ రావు ఇదివరకే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఫోన్ టాపింగ్ చేసినట్లుగా తెలియజేశారు.

014 -2

ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.కాగా తాజాగా ఈ కేసులో మరో ముఖ్యమైన పేరు వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘకాలంగా ఎస్ఐబిలో పనిచేసిన దయానంద రెడ్డి పేరు ప్రస్తుతం ఈ కేసులో బాగా వినిపిస్తుంది.

అయితే ఈ ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావుతో సన్నిహితం ఉన్నట్లుగా తెలియడంతో ఈ కేసులో ఆయన పాత్ర పై పోలీసులు ఆరాతీస్తున్నారు. పోలీసుల విచారణలో ఆయన పై కాస్త అనుమానం కలిగిన దయానంద రెడ్డి పై కూడా చర్యలు తీసుకుంటారని చెప్పాలి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?