ఇప్పలగూడెం హత్య కేసును ఛేదించిన పోలీసులు

నిందితులు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు : డి.ఎస్.పి లక్ష్మీనారాయణ

ఇప్పలగూడెం హత్య కేసును ఛేదించిన పోలీసులు

805నల్లగొండ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8( క్విక్ టుడే) : నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం ఇప్పలగూడెం  గ్రామంలో వివాహేతర సంబంధంతోనే వంటల సైదులను హత్య చేసినట్లు డి.ఎస్.పి లక్ష్మీనారాయణ వెల్లడించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  వివాహేతర సంబంధంతోనే వంటల సైదులు తండ్రి జానయ్య హత్య జరిగినట్లు వివరించారు. కేతపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన సైదులు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడని వివరించారు. అదే గ్రామానికి చెందిన మోదాల శ్రావణ్ కుమార్ వ్యవసాయ భూమిలో కూలిపనికి వంటల సైదులు వెళ్లేవాడని తెలిపారు. ఈ క్రమంలోమోదల శ్రవణ్ కుమార్ భార్యతో సైదులు చనువుగా ఉండేవాడని. దీంతో తన భార్యతో వివాహ వివాహేతర సభను కొనసాగిస్తున్నారని అనుమానంతో సైదులు పై శ్రావణ్ కుమార్ కోపం పెంచుకున్నట్టు వివరించారు.

వివాహేతర సంబంధ విషయం శ్రవణ్ కుమార్ తన సొంత బామ్మర్ది సూర్యాపేట జిల్లా కుడకుడ గ్రామానికి చెందిన బండారి వెంకటేష్ కు వివరించారు. వెంకటేష్ స్వయానా బాబాయ్ కుమారుడైన బండారి సాయికుమార్ సహాయం కోరారు. ముగ్గురు కలిసి వంటల సైదులు ను ఎలాగైనా చంపాలని పథకం పనినట్లు పోలీసు విచారణలో నిందితులు వెల్లడించినట్టు వివరించారు. పథకంలో భాగంగా ఈనెల 3న శనివారం రాత్రి వంటల సైదులు ఇప్పలగూడెం గ్రామం లో బెల్టు షాపులో మద్యం  సేవిస్తుండగా వెంకటేష్, సాయి కుమారులు ఇద్దరు అక్కడికి వెళ్లారు. గ్రామ శివారులో ఐకెపి సెంటర్ వద్ద మద్యం సేవిద్దామని వంటల సైదులు తోడుగా తీసుకొని, మద్యం కొనుగోలు చేసి వెంట తీసుకొని వెళ్లారు. శ్రవణ్ కుమార్ కూడా వారి దగ్గరికి చేరుకొని, నలుగురు కలిసి మద్యం సేవించినట్లు వివరించారు. మోదల శ్రవణ్ కుమార్ వంటల సైదులతో కలగజేసుకొని తన భార్యతో ఎందుకు చనువుగా ఉంటున్నావని ఘర్షణ పడ్డారు. దీంతో పెద్ద గొడవ గా మారిందని తెలిపారు. చంపాలని పథకంలో భాగంగానే వెంట తెచ్చుకున్న సుత్తితో శ్రవణ్ కుమార్, వెంకటేశులు వంటల సైదులు కొట్టడంతో చనిపోయాడు. ఘర్షణ జరుగుతున్న సమయంలో రోడ్డుపై సాయికుమార్ కాపలాగా ఉన్నాడు. ఈ హత్యపై కేతపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించినట్లు వివరించారు. ఈనెల 7న ముగ్గురు నిందితులను ఇప్పలగూడెంలో అరెస్ట్ చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన సుత్తి రెండు బైకులు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన శాలిగౌరారం సిఐ ఎస్ రాఘవరావు.కేతపల్లి ఎస్ఐ శివతేజ, సిబ్బంది మహేష్ అజిత్ రెడ్డిని డిఎస్పీ అభినందించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?