Ganesh Chaturthi: స్వాతంత్య్రోద్య‌మంలో భార‌తీయుల‌ను ఏకం చేసిన  గ‌ణ‌ప‌తి ఉత్స‌వాలు.. బాగంగాధర్‌ తిలక్‌ స్ఫూర్తితో నేటికీ కొన‌సాగింపు..

Ganesh Chaturthi: స్వాతంత్య్రోద్య‌మంలో భార‌తీయుల‌ను ఏకం చేసిన  గ‌ణ‌ప‌తి ఉత్స‌వాలు.. బాగంగాధర్‌ తిలక్‌ స్ఫూర్తితో నేటికీ కొన‌సాగింపు..

స్వాతంత్య్ర ఉద్య‌మంలో బ్రిటిష్ పాల‌కులు విభ‌జించు పాలించు సిద్ధాంతం వినియోగించి భార‌తీయుల‌ను విడ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేశారు. భార‌తీయులు ఏకం అయితే త‌ప్ప బ్రిటిష్ పాల‌కుల నుంచి విముక్తి రాద‌ని  గ్ర‌హించి ప్రజలను ఏకతాటిపైకి తీసుకుని వచ్చేందుకు వినాయక నవరాత్రి ఉత్స‌వాల‌ను ఆనాడు బాగా ఉపయోగించు కున్నారు. ప్రజలను భక్తిభావంతో ఏకం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నడిపించారు.

ఇందులో భాగంగా ఇంటికే పరిమితమైన గణపతి పూజను నవరాత్రులుగా మలిచిన ఘనత లోకమాన్య బాలగంగాధర తిలక్‌ సొంతం. బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్బంధాన్ని ధిక్కరించేందుకు, దైవభక్తికి దేశభక్తిని జోడిరచిన అపురూప సందర్భం గణపతి నవరాత్రులు. వలస పాలనలో వివక్షకు లోనవుతున్న భారతీయ సంస్కృతి, సంప్రదా యాలను పునరుద్ధరించేందుకు తొమ్మిది రోజుల వేడుక ఒక ప్రత్యేక సందర్భం. జాతీయోద్యమంలో భాగంగా మహారాష్ట్ర పుణెలో 1893లో లోకమాన్య తిలక్‌ గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలకు పిలుపునిచ్చారు. 

ఆ స్ఫూర్తి భాగ్యనగరానికీ వ్యాప్తి చెందింది. అప్ప‌టి నుంచి ఇప్పటి వరకు ప్ర‌తి ఏటా గణపతి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశభక్తి, స్వాతంత్య కాంక్షను సామాన్యుల్లో రగిలించేందుకు, గమ్యం తెలియని బాటసారి లా అయోమయంలో ఉన్న యువతను ఒక సామాజిక లక్ష్యం దిశగా నడిపించేందుకు, 127 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా సర్వ జనైక్య గణేశ్‌ ఉత్సవాలకు లోకమాన్య బాలగంగాధర తిలక్‌ పిలుపునిచ్చారు. గణపతి నవరాత్రులను సామాజిక వేదికలుగా మలిచారు.

06 04

ఆ జాతియోద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తంగా వ్యాపించింది. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించిన తిలక్‌ పిలుపుతో కొందరు భాగ్యనగరవాసులు ముందుకొచ్చారు. నగరంలో స్థిరపడిన కొందరు మహారాష్టీయ్రులు సామూహిక వినాయక పూజకు నాంది పలికారు. దాదాపు 125 ఏళ్ల క్రితం అలా హైదరాబాద్‌లోని గణపతి ఉత్సవాల శోభ ప్రారంభమయ్యింది. భాగ్యనగరంలో గణేశ్‌ ఉత్సవాలు తొలిసారిగా పాతబస్తీలోని శాలిబండ ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. కొందరు మరాఠాలు 1895లో గణేశ్‌ ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడం ప్రారంభించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

1895, మార్చి 27న శాలిబండలో ఉగాది పర్వదినం రోజున భారత గుణవర్థక్‌ సంస్థను స్థాపించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న మహారాష్టీయ్రులైన బాలచంద్ర దీక్షిత్‌, వక్రతుండ దీక్షిత్‌, నారాయణరావు పిల్‌ఖానె, లక్ష్మణరావు సదావర్తె, దాదాచారి కాలె తదితర మిత్ర బృందం సారధ్యంలో మరికొందరి స్థానిక కాయస్తులు, వ్యాపారవేత్తల సహకారంతో ఆ మరాఠా సంస్థను నెలకొల్పారు. అప్పటి నుంచి కులమతాలకతీతంగా అందరూ కలిసి గణపతి మండపాలను నెలకొల్పడం,

తద్వారా రాజకీయ చర్చలు, స్వాతంత్య స్ఫూర్తిని యువతలో ప్రేరేపించే సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే క్రతువుకు శ్రీకారం జరిగింది. ఆ సంస్థ పాలకవర్గ సభ్యులు నేటికీ గణేశ్‌ నవరాత్రి వేడుకలను కొనసాగిస్తున్నారు. అప్పట్లో చెరువుల్లోని నల్లమట్టినే వినాయక ప్రతిమల తయారీకి వాడేవారు. చవితినాడు మట్టిగణపయ్యను ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించేవారు. 

06 03

సాయంత్రం వేళల్లో 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జానపద నృత్యాలు, గీతాలాపన, భక్తి కీర్తనలు, భజన, పారాయణం, పద్య, ఇతిహాస నాటకాలు, సంగీత కచేరీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు, ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఆ కార్యక్రమాలు చూసేందుకు పెద్ద ఎత్తున మండపాల వైపు తరలి వచ్చేవారు. ఆ పూజా కార్యక్రమాలు, కళా ప్రదర్శనలే దేశ సమైక్యతకు స్ఫూర్తిగా నిలిచేది.

అలాంటి పరిస్థితులలోనూ నిజాం ప్రభుత్వం సమ్మతించేలా గణపతి నవరాత్రులు నగరంలో జరగడం విశేషం. ప్రారంభంలో శాలిబండ నుంచి నగరంలో మరికొన్ని ప్రాంతాలకు గణేశ్‌ ఉత్సవాలు విస్తృతమయ్యాయి. తొమ్మిది రోజుల పాటూ రోజూ సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు కుటుంబంతో సహా వెళ్లేవాళ్లం. రెండు కళ్లు చాలవు అన్నంతగా సంబరాలు జరిగేవి. పదో రోజు తెల్లవారుజామున పిల్లలు, పెద్దలు అంతా కలిసి మట్టి గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీలో నిమజ్జనం చేసేవాళ్లు. 

అలా మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఊరూవాడా విస్తరించింది. ఛత్రపతి శివాజీ పరిపాలనా సమయంలోనే మరాఠా రాజ్యంలో వినాయక ఉత్సవాలు ప్రారంభం అయ్యాయని కొందరు చరిత్రకారులు అంటారు. వినాయకుడిని పీష్వాలు తమ కులదేవుడిగా ఆరాధిస్తారు. కనుక 17వ శతాబ్దంలో శివాజీ చేతుల విూదుగా గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయని కొందరి అభిప్రాయం.

06 I01

ఆయన స్ఫూర్తి కొనసాగింపుగా లోకమాన్య తిలక్‌ శివాజీ ఉత్సవాలు, గణేశ్‌ ఉత్సవాలను ప్రారంభించారని చారిత్రక అధ్యయనకారులు చెబుతారు. భాగ్యనగర గణపతి నవరాత్రి ఉత్సవాలు నగర ప్రజల సామరస్య జీవనానికి, ఐకమత్యకు అద్దం పడతాయి. హైదరాబాద్‌లోని కొన్ని వినాయక మండపాలలో లంబోదరుడి లడ్డూ ప్రసాదాన్ని కొందరు ముస్లిం, క్రిష్టియన్లూ వేలంపాట ద్వారా దక్కించుకోవడం అందుకు తార్కాణం. అంతేకాదు,

చార్మినార్‌ తదితర ప్రాంతాలలో గణపతి శోభాయాత్ర సమయంలో కొందరు ముస్లింలు ఎదురెళ్లి భక్తులకు మంచినీరు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. అలా నగరంలో వినాయకచవితి జోష్‌ నెలకొంది. రోడ్ల నిండుగా విగ్రహాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ తరవాతే లడ్డూ వేలాలు మొదలయ్యాయి. బాలాపూర్‌, ఖైరతాబాద్‌ ప్రసిదిద్దికెక్కాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?