Sri Rama Mantras : శ్రీరాముడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలంటే... ఈ మంత్రాలు ప్రతిరోజు పఠించండి..

Sri Rama Mantras :  శ్రీరాముడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలంటే... ఈ మంత్రాలు ప్రతిరోజు పఠించండి..

Sri Rama Mantras : అందరూ కూడా దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు శ్రీరాముని కళ్యాణం. ఈరోజు నుంచి ఎప్పుడైనా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలను పఠించడం వలన ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి. జీవితంలోని కఠినమైన సవాలను సులభంగా అధికమించగలుగుతారు..

రామా అనే ఈ రెండు అక్షరాలు ఎంతో శక్తివంతమైనవి.. శ్రీరామన మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు పొందవచ్చు.. శ్రీరామ అని మూడుసార్లు జపించడం వలన విష్ణు సహస్ర పారాయణ చేసినంత పుణ్యం ఫలం పొందవచ్చు..

కష్టాల్లో ఉన్నప్పుడు కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు శ్రీరామ అనే మంత్రాన్ని జపించడం అన్నిటికీ పరిష్కారమని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఏడు కోట్ల మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం రామా నామము అని పేర్కొన్నారు. రామా అనే మంత్రం పఠించడం వలన ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మార్గం ఏర్పడుతుంది.

శ్రీరాముని పట్ల భక్తిని కలిగిస్తుంది. ఆయన అనుసరించిన మంత్రాలు కట్టుబడి ఉంటేనే మనిషిగా పరిపూర్ణత పొందుతారు. శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలను జపించడం వలన భౌతిక శ్రేయస్సు కలుగుతుంది. సంతోషంగా జీవితం సాగిపోతుంది.

174 -2

 శ్రీరాముడికి సంబంధించిన ఈ మంత్రాలను శ్రీరామనవమి రోజున‌ జపించారంటే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. సకల బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. శ్రీరాముని అనుగ్రహంతో మనసు ప్రశాంతత కలుగుతుంది..

"శ్రీరామచంద్రాయ నమః
ఈ మంత్రాన్ని జపిస్తే చంద్రదేవుడిని శ్రీరాముడిని పూజించినట్లే.. ఈ మంత్రాన్ని జపించడం వలన మానసిక ఆందోళన నుంచి విముక్తి కలుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

*శ్రీరామ శరణం మమ:
ఈ మంత్రాన్ని ప్రతి రోజు పఠించడం వలన భక్తుడు గొప్ప శారీరక మానసిక ధైర్యాన్ని పొందుతారు. శరీరం ఆనందంతో నిండిపోతుంది. శారీరిక స్వస్థత చేకూరుతుంది.

*రామాయ నమః
ఈ మంత్రం జపించడం వలన వ్యక్తి ఏకాగ్రత మెరుగుపడుతుంది. జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధగా తప్పులు లేకుండా సరియైన ఉచ్చారణతో ఈ మంత్రం జపించడం వలన నైతిక స్వచ్ఛత మనసులోని మలినాలు ప్రక్షాళనకు ఉపయోగపడుతుంది.

*హిస్ రామ్ హిస్ రామ్:
ఆధ్యాత్మికంగా బలపడేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది.

*శ్రీరామ జయరామ కోదండరామ:
శ్రీరాముని కోదండ రాముడు అని కూడా పిలుస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వలన జీవితంలో విజయాలను పొందుతారు. సామరస్యం మేలుకుంటుంది. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఆందోళనలు తొలగిపోతాయి.

174 -3

*ఓం దశరధాయ విద్మహే సీతా వల్లభాయ్ ధీమహి, తన్నో ప్రచోదయాత్:
 పవిత్రమైన రామ గాయత్రి మంత్రం జపించడం వలన వైవాహిక జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. శ్రీరాముని ఆరాధించే సీతమ్మ తల్లికి ఈ మంత్రం అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని జంపించినప్పుడు మెదడు సమతుల్యం అవుతుంది.

*ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకల జన్వంశం కారాయ స్వాహా:
ఈ మంత్రం జపించడం వలన సద్గుణాలు అలవడతాయి. శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు.

*రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే.. రామనాధాయ నాదాయ సీతయా. పతయే నమః
ఈమత్ మంత్రాన్ని జపించడం వలన మనశ్శాంతి చేకూరుతుంది. శ్రీరాముడు ఎప్పుడు మీ వెంటే ఉన్నట్లు భావన కలుగుతుంది. జీవితాన్ని సరియైన మార్గంలో నడిపించగలుగుతారు. శ్రీరాముడి తండ్రి దగ్గర నుంచి భార్య సీతమ్మ వరకు ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలిచేవాళ్ళు ఆ పేర్లన్నీ కలగలిపిన మాత్రమే ఇది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?