Sri Rama Navami: 2024లో మీ జాతకం మారిపోవాలంటే శ్రీరామ నవమి రోజు ఈ మంత్రాలను పఠించండి...

Sri Rama Navami: 2024లో మీ జాతకం మారిపోవాలంటే శ్రీరామ నవమి రోజు ఈ మంత్రాలను పఠించండి...

Sri Rama Navami:  భారతదేశంలో హిందూ దేవుళ్ళలో శ్రీరాములవారికి విశిష్టమైన స్థానం ఉంటుంది. శ్రీరాములవారి చరిత విన్న చూసిన ఒళ్ళు పులకరించిపోతుంది. అందుకే దేశంలో శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. నిత్యం రామజపం చేస్తూ శ్రీరాముల వారి పాదాల చెంత కాలాన్ని గడుపుతూ ఉంటారు.

అయితే అలాంటి రామ భక్తులకు ఏడాదికి ఒకసారి వచ్చే అత్యంత విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రులలో వచ్చే శుద్ధ నవమి తిధి రోజు శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఏప్రిల్ 17 తేదీన  శ్రీరామనవమి రావడం జరిగింది.

సనాతన ధర్మంలో హిందూమత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు పురుషులలో ఉత్తముడు , ఏకపత్నివ్రతలు , తండ్రి మాట జవదాటకుండా శిరసావహించేవాడు. అసత్యం పలకని వాడు. ఇలాంటి ఎన్నో విశిష్టమైన లక్షణాలను కలిగి ఉన్న శ్రీరాముడు అనుగ్రహం పొందాలంటే కచ్చితంగా పుణ్యం చేసుకొని ఉండాలి.

133 -2

మరి ఈ శ్రీరామనవమి రోజు శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కచ్చితంగా కొన్ని మంత్రాలను జపించాలని తద్వారా మంచి ఫలితాలను పొందుతారని శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలోనే శ్రీరామనవమి పండుగ రోజు వేద శ్లోకాలను పటించినట్లయితే శ్రీమహావిష్ణువు సహస్రనామం పఠించినట్లే అని వేద పండితులు చెబుతున్నారు.

తద్వారా మీకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. మరి శ్రీరామనవమి సందర్భంగా వేదమంత్రాలను పఠించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో..?ఎలాంటి మంత్రాలు పటించాలి..? ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరామ మంత్రం...

"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ రామ వరాననే"...శ్రీరాముని యొక్క ఈ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజు నిత్యం పఠించడం వలన శ్రీమహావిష్ణువు సహస్రనామం పఠించినట్లేనని ,అంతటి ఫలితం వస్తుందని శివయ్య తన భార్య పార్వతి కి చెప్పినట్లుగా పురాణాలు చెబుతున్నాయి .

133 -3

ఇక ఈ మంత్రంలో మనం ఉచ్చరించే రామ అనే పదాన్ని , విష్ణు ,మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. ఈ పదంలో ఉన్న "రా" అక్షరం రుద్రుడిని "ఆ" అక్షరం బ్రహ్మను "మ" అక్షరం శ్రీహరిని సూచిస్తున్నట్లుగా వేదాలు చెబుతున్నాయి.

ఇక ఈ మంత్రంలో రామ అనే రెండు అక్షరాలను పదేపదే జపించడం వలన మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాక ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టవచ్చట. అయితే ఈ మంత్రాలను పఠించడానికిి ముందు మీరు భగవంతుని దగ్గర పూజ చేసి దీపం వెలిగించాలి.

అనంతరం  మంత్రాలను పట్టించడం మొదలుపెట్టాలి. ఈ విధంగా చేయడం వలన మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ శ్రీరామనవమిలో ఏకాగ్రతతో రామకోటి రాసి దానిని గుడిలో సమర్పించడం వలన అనుకున్నవి జరుగుతాయని నమ్మకం.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?