Ugadi 2024 : ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో తొలి పూజలు చేసి మొక్కలు తీర్చుకున్న ముస్లిం భక్తులు

Ugadi 2024 : ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో తొలి పూజలు చేసి మొక్కలు తీర్చుకున్న ముస్లిం భక్తులు

Ugadi 2024 : ఇవాళ కొత్త సంవత్సరం. ఉగాది వచ్చిందంటే మనకు క్యాలెండర్ ప్రకారం కాకున్నా.. మన తిథి ప్రకారం కొత్త సంవత్సరంగా భావిస్తాం. ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. క్రోధం అంటే కోపం. అంటే.. మనం కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనే భావంతో క్రోధి నామ సంవత్సరం పేరు వచ్చింది.

ఉగాది వచ్చింది అంటే ముస్లింలు ఆ గుడిలో తొలి పూజ నిర్వహిస్తారు. అదేంటి.. ముస్లింలు తొలి పూజ నిర్వహించడం ఏంటి అని అనుకుంటున్నారా? పదండి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. 

ఆ గుడి పేరు దేవుని గడప. కడప జిల్లాలో ఉంది. అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ గుడిలో ఉగాది నాడు ముస్లింలు పూజలు నిర్వహిస్తారు. ముస్లిం మహిళలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని వేంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారు. అసలు ముస్లింలు వేంకటేశ్వర స్వామికి పూజలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. 

దానికి కారణం ఏంటంటే.. వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. ఆయన రెండో భార్య పేరు బీబీ నాంచారమ్మ. ఆమె ముస్లిం మహిళ. అందువల్ల ముస్లింలు అందరూ ఉగాది రోజు ఆ గుడికి వెళ్లి వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు. 

Ugadi 2024 : పుట్టింటి ఆడపడుచుకు చీర, సారే సమర్పణ

ఈ ఆలయానికి ఉగాది రోజు ముస్లిం మహిళలు క్యూ కడతారు. పుట్టింటికి వెళ్లినప్పుడు ఎలా పుట్టింటి వారు.. తమ ఆడపడుచులకు చీర, సారే పెడతారో.. అదే విధంగా.. ప్రతి సంవత్సరం ముస్లిం మహిళలు వేంకటేశ్వర స్వామి భార్య బీబీ నాంచారమ్మను తమ పుట్టింటి ఆడపడుచుగా భావించి ఆమెకు చీర, సారే సమర్పిస్తారు. 

10 -2

అలాగే.. వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు. తమ ఆడపడుచును వేంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి.. తమ బావగా వేంకటేశ్వర స్వామిని భావించి ముస్లిం మహిళలు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఉగాది నాడు ఉదయమే ఆ గుడికి చేరుకొని ముస్లిం మహిళలు పూజలు నిర్వహిస్తారు. ఉగాది సంవత్సరం తొలి రోజు కాబట్టి ఆ రోజు పూజలు నిర్వహిస్తే.. తమ కోరికెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అందుకే ఉగాది నాడు ఉదయమే ఈ గుడికి చేరుకొని ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అంతే కాదు.. ఖచ్చితంగా ఉగాది నాడు వచ్చి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తే తమ కోరికెలు నెరవేరుతాయని ముస్లింలు బలంగా నమ్ముతారు. అందుకే.. ఏరోజు గుడికి వెళ్లినా వెళ్లకున్నా.. ఉగాది నాడు మాత్రం ఖచ్చితంగా గుడికి వెళ్లి తమ కోరికలను వేంకటేశ్వర స్వామికి విన్నవించుకుంటారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?