Good People : మంచి వాళ్లే తొందరగా ఎందుకు చనిపోతారు..?
Good People : మన వెనకటి తరం వాళ్లు అంటే మన తాత ముత్తాతలు వాళ్లు నూరు దీపావళి పండుగలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.. అంటే వాళ్లు ఇంచుమించు నూరేళ్లు బతికారు అని మనకు తెలుస్తోంది. కానీ ప్రస్తుత కాలంలో మనుషులు 60 లేదా 70 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతున్నారు. అందులోనూ మంచివాళ్లు త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా దేవుడి దగ్గరికి వెళ్లి పోతున్నారు.
చిన్న వయసులోనే దేవుడు మంచి వాళ్ళని చాలా త్వరగా తన దగ్గరికి తీసుకుపోతాడని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు? అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? చెడు చేసే వారి కంటే మంచి చేసే వారే ఎందుకు త్వరగా చనిపోతున్నారు.. అనే విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పుట్టకముందే అతని ఎక్కడ.? ఎప్పుడు.? ఎక్కడ పుడతాడో.? ఎప్పుడో నిర్ణయించబడిందని నమ్ముతారు
చెడు చేసేవారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని అలాగే పుణ్యాత్ములు చాలా తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారని తెలుస్తోంది. ఈ ప్రాపంచిక సముద్రాన్ని 84 లక్షల సార్లు ఈ సంసార సహకారాన్ని కేదారేసి ఉంటుంది. అప్పుడు అతనికి మోక్షం లభిస్తుంది అని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. వేల లక్షలు జన్మల తర్వాత మాత్రమే ఆ ఆత్మకు పవిత్రత లభిస్తుంది. మోక్షం చాలా లేటుగా లభిస్తుంది అని దీని సారాంశం.
ఏంటంటే మనం ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్రయోజనం కోసం పుట్టామని విషయాన్ని మనకు తెలిసేలా చేస్తాడు.అందుకే దేని మీద వ్యామోహం పెంచుకోవద్దని చెప్పి మరి ఈ లోకంలోకి పంపిస్తాడు. దేవుడు అలా ఆ ఆత్మ తన పని తాను పూర్తి చేశాక.. దేవుడు మనలను తిరిగి తన వద్దకు తీసుకెళ్లి పోతాడు. ఎక్కువ కాలం బతకాలంటే వారు చేయాల్సింది ఇంకా ఏదో మిగిలిపోయిందని అర్థం.
మంచి వ్యక్తులు ఎందుకు త్వరగా చనిపోతారో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా.. ఈ గ్రంథం చాలా లోతయింది. కాబట్టి మంచి అలవాట్లు నేర్చుకుంటే ఎంతో మంచిది. దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మాత్రమే మనకు మోక్షాన్ని ప్రసాదించగల దని మన గ్రంధాలు తెలుపుతున్నాయి..