UPSC 2023 Topper : ఫస్ట్ ర్యాంక్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ ఆదిత్య శ్రీవాత్సవ

UPSC 2023 Topper : ఫస్ట్ ర్యాంక్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ ఆదిత్య శ్రీవాత్సవ

UPSC 2023 Topper : 2023 సంవత్సరానికి సంబంధించిన సివిల్స్ తుది ఫలితాలను మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. 2023 సంవత్సరానికి గాను మొత్తం 1016 మందిని యూపీఎస్సీ సెలెక్ట్ చేసింది. 

సివిల్స్ 2023 లో ఫస్ట్ ర్యాంక్ ఆదిత్య శ్రీవాస్తవకు వచ్చింది. అనిమేశ్ ప్రధాన్ కు రెండో ర్యాంకు వచ్చింది. మూడో ర్యాంకును మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్యరెడ్డి సాధించారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే 30 మంది ఉన్నారు. 

సివిల్స్ టాప్ ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ.. ఫస్ట్ ర్యాంక్ వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు. టాప్ 70 లో రావాలని దేవుడిని మొక్కుకున్నానని.. కానీ.. తనకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో తన ఆనందానికి అవధులు లేవన్నారు. 

179 -2

UPSC 2023 Topper : నిరంతర హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ వల్లనే సాధ్యం 

నిరంతరం హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయడం వల్లనే ఇది సాధ్యం అయిందని శ్రీవాత్సవ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

నాకు టాప్ 70 లోపు ర్యాంక్ వస్తుందని అనుకున్నా. 70 లోపు ర్యాంక్ వస్తేనే ఐఏఎస్ కు అర్హత సాధిస్తారు. అందుకే టాప్ 70 లో నా ర్యాంక్ ఉండాలని ఆ దేవుడిని వేడుకున్నా. కానీ.. నాకు టాప్ ర్యాంక్ వచ్చింది. ఎప్పటికప్పుడు నా తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ సాగించా.  నా మెంటర్స్, నా సీనియర్స్.. వీళ్ల గైడెన్స్ వల్లనే నాకు ఈ రోజు టాప్ ర్యాంక్ వచ్చింది అని ఆదిత్య తెలిపారు. 

సివిల్స్ లో విజయం సాధించాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. నిరంతర సాధన చేయాలి. అదే సివిల్స్ లో విజయానికి కీ అని స్పష్టం చేశారు.  నిరంతర సాధన, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్.. ఈ మూడు ఏ రంగంలో అయినా విజయం సాధించడానికి పునాదులు అని ఆదిత్య అన్నారు. 

మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి ఆశీస్సుల వల్ల, ఆదిత్య హార్డ్ వర్క్ వల్లనే ఇది సాధ్యం అయింది. ఆదిత్య తండ్రి కూడా ఎప్పుడూ ఆదిత్యను సివిల్స్ ప్రిపరేషన్ లో ప్రోత్సహించేవారు.. అని ఆదిత్య తల్లి ఆభా శ్రీవాత్సవ తెలిపారు. 

179 -1

మా మనవడు ఎప్పుడూ అన్నింట్లో టాపరే. మాకు ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. సివిల్స్ లోనూ టాపర్ అవడంతో చాలా సంతోషంగా ఉంది.. అని ఆదిత్య తాత శివరామ్ శ్రీవాత్సవ అన్నారు. ఈ దేశంలోనే జాతీయ స్థాయిలో నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు.. అని ఆదిత్య తండ్రి అజయ్ అన్నారు. 

సివిల్స్ పరీక్షలను ప్రతి సంవత్సరం యూపీఎస్సీ నిర్వహిస్తుంది. మూడు ఫేజ్‌లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ మూడింట్లో ప్రతిభ కనబరిచిన వాళ్లకే టాప్ ర్యాంక్ దక్కుతుంది. ప్రతి సంవత్సరం వెయ్యి మంది వరకు మాత్రమే సివిల్స్ లో ర్యాంక్స్ సాధిస్తుంటారు.

కానీ.. సివిల్స్ పరీక్షలను ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రాస్తుంటారు. సివిల్స్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసుల్లో అధికారులను యూపీఎస్సీ కమిటీ సెలెక్ట్ చేస్తుంటుంది. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?