Brazil Rains : బ్రెజిల్‌లో భారీ వరదలు.. 100 మంది మృత్యువాత.. నిరాశ్రయులైన లక్షల మంది

Brazil Rains : బ్రెజిల్‌లో భారీ వరదలు.. 100 మంది మృత్యువాత.. నిరాశ్రయులైన లక్షల మంది

Brazil Rains : బ్రెజిల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో వంద మంది మృత్యువాత పడగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా సౌత్ బ్రెజిల్ ను ఈ వరదలు ముంచెత్తాయి. దీంతో వేల ఇండ్లు డ్యామేజ్ అవడంతో పాటు లక్షల మంది తమ ఇళ్లను వదిలి శిబిరాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. దీని వల్ల లక్షల మంది నిరాశ్రయులవ్వడంతో పాటు కనీసం తాగడానికి నీళ్లు లేక, తిండి లేక, కరెంట్ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. 

ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్ సేవలు అన్నీ నిలిచిపోయాయి. సౌత్ బ్రెజిల్ లోని రియో గ్రాండే దోసుల్ అనే రాష్ట్రంలో గత వారం నుంచి కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటికే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. 15 వేల మంది సైనికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. పోర్టూ అలెగ్రే నగరం పూర్తిగా మునిగిపోయింది.

090 -2

దీంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు గవర్నర్. ప్రజలు వెంటనే శిబిరాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే.. గైబా నది భారీ వరదలకు తట్టుకోలేకపోతోంది. గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గైబా నది ఆనకట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని.. నది తీర ప్రాంతాలు, ఆనకట్టల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  

Brazil Rains : ఇళ్లు వదిలేసి పారిపోయిన 2 లక్షల మంది

దాదాపు 2 లక్షల మంది తమ ఇళ్లను వదిలేసి రక్షణ శిబిరాలకు వెళ్లిపోయారు. తమ ఇండ్లన్నీ మునిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఖాళీ బట్టలతో బయటపడ్డారు. గత వారం నుంచి కురిసిన వర్షాల వల్ల వచ్చే భారీ వరదల వల్ల ఇప్పటి వరకు 1.45 మిలియన్(14.5 లక్షలు) మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

ఏప్రిల్ 29 నుంచి బ్రెజిల్ ను వర్షాలు ముంచెత్తాయి. అప్పటి నుంచి కంటిన్యూగా పడిన వర్షాలకు రియో గ్రాండె దోసుల్ అనే రాష్ట్రం అతలాకుతలం అయింది. రాష్ట్రంలో ఉన్న 497 పట్టణాల్లో 414 పట్టణాలు వరదలకు తీవ్ర నష్టపోయాయి. 

090 -3

ఆ పట్టణాల్లోని ప్రజలంతా ఎక్కువగా వ్యవసాయం మీద ఆదారపడి జీవిస్తున్నారు. అవన్నీ అర్జెంటినా, ఉరుగ్వే దేశాలకు బోర్డర్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 904 మిలియన్ డాలర్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు. 

ప్రజల ఇండ్లు, రోడ్లు, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, ఇతర వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయి. ఒక్క వారంలోనే రాష్ట్రంలో 5 నెలల్లో కురవాల్సిన వర్షం కురిసింది. అందుకే రాష్ట్రం ఒక్కసారిగా అతలాకుతలం అయింది. రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?