Helicopter Crash : కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. 10 మంది స్పాట్ డెడ్
కెన్యా డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమండి ఒగొల్లా మృతి చెందడంపై కెన్యా ప్రెసిడెంట్ విలియమ్ రుటో సంతాపం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలియగానే.. కెన్యా ప్రెసిడెంట్ విలియం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తో ఎమర్జెన్సీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన కెన్యా రాజధాని నైరోబీకి 400 కిమీల దూరంలో ఉన్న ఎల్గెయో మరక్ వెట్ దేశంలో చోటు చేసుకుంది. హెలికాప్టర్ క్రాష్ కు కారణాలను వెంటనే అణ్వేషించాలని.. దర్యాప్తు టీమ్ ను కెన్యా ఎయిర్ ఫోర్స్ ఆదేశించింది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు గుర్తించారు. డిఫెన్స్ చీఫ్ మరణంతో శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు దేశమంతా సెలవులు ప్రకటించారు. కెన్యా జెండాను కూడా సగం వరకే ఎగురవేయాలని ఆదేశించారు. దేశమంతా సంతాప సభలు నిర్వహించాలని దేశ అధ్యక్షుడు రుటో వెల్లడించారు.
గత 12 నెలల్లో ఇప్పటి వరకు ఐదు మిలిటరీ హెలికాప్టర్లు క్రాష్ అయ్యాయి. దానికి కారణం.. హెలికాప్టర్ల నిర్వహణ సరిగ్గా లేదని.. అవన్నీ పాతవని, వాటిని ఎలాంటి మెయిన్ టెనెన్స్ లేకుండా వాడటం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కెన్యా మీడియా రిపోర్ట్ చేసింది.
జూన్ 2021 లో కూడా నైరోబీలో హెలికాప్టర్ కూలిన ఘటనలో 10 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. ఒగొల్లా ప్రయాణించిన హెలికాప్టర్ పేరు హువె. నార్త్ రిఫ్ట్ ఏరియాలో ఉన్న ట్రూప్స్ ను విజిట్ చేయడం కోసం హెలికాప్టర్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆపరేషన్ మలిజా ఉహలిఫులో భాగంగా నార్త్ రిఫ్ట్ ప్రాంతంలో ట్రూప్స్ ను ఏర్పాటు చేశారు.
హువే హెలికాప్టర్ అసలు వేరు యూహెచ్ 1బీ హెలికాప్టర్. దీన్ని 1950 లో తయారు చేశారు. ఈ హెలికాప్టర్ ను వియత్నాం వార్ సమయంలో యూఎస్ మిలిటరీ వాడుకుంది.