Indian Women died in US : యూఎస్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారత మహిళలు మృతి
మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆ ఎస్యూవీ కారు.. గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Indian Women died in US : స్పీడ్ లిమిట్ కు మించి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం
స్పీడ్ లిమిట్ కు మించి వేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చీఫ్ డిప్యూటీ కొరొనర్ మైక్ ఎల్లిస్ అన్నారు. ఈ ప్రమాదంలో వేరే ఏ ఇతర వాహనాలు ఇన్వాల్వ్ కాలేదని.. కేవలం మితిమీరిన వేగం వల్లనే ఆ ఎస్యూవీ అదుపు తప్పిందని తెలిపారు.

వెంటనే అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సౌత్ కరొలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ, మల్టిపుల్ గ్రీన్ విల్లే కౌంటీ ఈఎంఎస్ యూనిట్స్ అందరూ అక్కడికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
అయితే.. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మాత్రం ప్రాణాల నుంచి బయటపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళలు రేఖాబేన్ పటేల్, సంగీతాబేన్ పటేల్, మనీషా బేన్ పటేల్ గా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు, ఆనంద్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.
ఇక.. కారు అత్యంత వేగంతో వెళ్లి చెట్టుకు ఢీకొనడంతో కారు ముక్కలు ముక్కలుగా అయింది. కారు కొంత భాగం చెట్టులోనే చిక్కుకుపోయింది. అయితే.. ఆ కారులో డిటెక్షన్ సిస్టమ్ ఉంది. కారు ప్రమాదానికి గురికాగానే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రెస్క్యూ టీమ్ కు ఇన్ ఫామ్ చేసి ఆ గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగలిగారు.