Israel Airstrikes on Iran Embassy in Syria : సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ ఎంబసీపై ఎయిర్ స్ట్రైక్.. 11 మంది మృతి

 Israel Airstrikes on Iran Embassy in Syria : సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ ఎంబసీపై ఎయిర్ స్ట్రైక్.. 11 మంది మృతి

Israel Airstrikes on Iran Embassy in Syria : ఇజ్రాయెల్ మరోసారి రెచ్చిపోయింది. సిరియాపై బాంబుల వర్షం కురిపించింది. సిరియా రాజధాని డమాస్కస్ లో ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీపై తన ప్రతాపాన్ని చూపించింది. ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.

ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్టు బ్రిటన్ లో పని చేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. చనిపోయిన 11 మందిలో 8 మంది ఐరాన్ కి చెందిన వాళ్లు కాగా, ఇద్దరు సిరియా వాళ్లు, ఒకరు లెబనీస్ వాళ్లుగా గుర్తించారు. అయితే.. ఇరాన్ ఎంబసీకి చెందిన కాన్సులర్ విభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది.

ఎంబసీ పక్కనే ఈ కాన్సులర్ భవనం ఉంది. ఈ దాడిపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ.. ఇజ్రాయెల్ మాత్రం ఖచ్చితంగా ఈ దాడికి ప్రతిదాడిని ఎదుర్కొంటుందని.. తాము కూడా ఇదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రాయబారి అక్బరీ హెచ్చరించారు. 

204 -2

Israel Airstrikes on Iran Embassy in Syria : ఎయిర్ స్ట్రైక్స్ లో మృతి చెందిన బ్రిగేడియర్ జనరల్

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ మిలిటరీ సలహాదారు జనరల్ మహమ్మద్ రెజా జహెదీ మరణించారు. అలాగే మరో అధికారి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ హదీ హజీ రహిమి మృతి చెందారు.  ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది హైలేవల్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు.

వీళ్లను ఐఆర్జీసీ అంటారు. గాజా యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి హమాస్ విషయంలో  హెజ్ బొల్లా, ఇజ్రాయిల్ మధ్య బార్డర్ వద్ద యుద్ధం కొనసాగుతూనే ఉంది. కానీ.. ఇలా ఇరాన్ ఎంబసీపై దాడి చేసేంత దారుణానికి ఇజ్రాయెల్ పూనుకుంటుందని ఊహించలేదని హెజ్ బొల్లా గ్రూప్ వెల్లడించింది. 

లెబనాన్ లో హెజ్ బొల్లా గ్రూప్ విస్తరణలో జహేదీ కీలక పాత్ర పోషించారని.. ఆయన త్యాగాన్ని హెజ్ బొల్లా ఎన్నటికీ మరవదని వెల్లడించింది. ఇరాన్ కు చెందిన క్యుడ్స్ ఫోర్స్ కు జహేదీ లీడర్ గా వ్యవహరించారన్నారు పాలెస్థీనా, సిరియా, లెబనాన్ కు చెందిన క్యూడ్స్ ఫోర్స్ లకు జహేదీ లీడర్ గా వ్యవహరించారు. 

204 -3

ఈ దాడిపై తాము స్పందించం. ఈ దాడి విషయంలో ఇప్పుడు మేము ఎలాంటి ప్రకటనలు చేయం అని చెప్పడంతో ఈ ఘటన తమని మరింత రెచ్చగొట్టిందని.. ఇప్పటికే గాజా యుద్ధంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయని.. ఇజ్రాయెల్ ప్రతిదాడికి సిద్ధం కావాల్సిందేనని ఇరాన్ అధికారులు హెచ్చరించారు. 

ఇక.. ఇరాన్ మిలిటరీ సలహాదారు అయిన రెజా జెహదీ 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఉన్న ఖుద్స్ అనే బలగాలకు నేతృత్వం వహించారు. ఆయన ఇరాన్ మిలిటరీ కోసం ఎన్నో మిషన్లలో పాల్గొన్నారు. తన ప్రాణాలను సైతం ఏనాడూ లెక్కచేయలేదు. 

ఇరాన్ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన రెజా జెహదీ మృతిపై ఇరాన్ చాలా కోపంగా ఉంది. జెహదీతో పాటు పలువురు ఇతర సిబ్బందిని పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకోకుండా ఉండం అని ఇరాన్ శపథం చేసింది. యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని ఇజ్రాయెల్ కు పిలుపునిచ్చింది ఇరాన్. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?