Maldives Thanks India : మాల్దీవులకు భారత్ మళ్లీ ఎందుకు సాయం చేసింది? ముయిజ్జు భారత్‌ను అవమానించినా ఎందుకు అండగా నిలిచింది? 

Maldives Thanks India : మాల్దీవులకు భారత్ మళ్లీ ఎందుకు సాయం చేసింది? ముయిజ్జు భారత్‌ను అవమానించినా ఎందుకు అండగా నిలిచింది? 

Maldives Thanks India : భారత్, మాల్దీవుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించి తెలిసిందే. మాల్దీవులకు టూరిజం ద్వారా అధిక ఆదాయాన్ని అందిస్తున్న భారత్ పై, పలు సందర్భాల్లో మాల్దీవులను అందుకున్న భారత ప్రభుత్వంపై.. మాల్దీవులు ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి.

మాల్దీవులు కాకపోతే మన దేశంలోనే ఉన్న లక్షద్వీప్ చాలా బెటర్ అని.. దాని కన్నా బెస్ట్ టూరిజం ప్లేసులు భారత్ లో చాలా ఉన్నాయని భారతీయులు కూడా మాల్దీవుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మా భారత్ ను కించపరుస్తారా? అని మాల్దీవులను భారతీయులు బైకాట్ చేశారు. దీంతో మాల్దీవులు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.  ఇదంతా అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది.

సోషల్ మీడియాలో బైకాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోనూ కొనసాగింది. భారత్.. మాల్దీవులకు చేసిన సాయాన్ని మరిచిన మాల్దీవులు ప్రభుత్వం భారత్ పై రెచ్చిపోయింది. కరోనా సమయంలో భారత్.. మాల్దీవులను ఆదుకుంది. ఇతర సంక్షోభ సమయాల్లోనూ భారత్.. మాల్దీవులను ఆదుకుంది. ఉదారంగా సాయం చేసింది. కానీ.. అవన్నీ మరిచి మాల్దీవులు అప్పట్లో ఎగిరెగిరిపడినా.. మళ్లీ భారత్ మాల్దీవులకు సాయం చేసింది. 

142 -2

Maldives Thanks India : లోన్ తీర్చేందుకు మరో ఏడాది గడువు ఇచ్చిన భారత్

భారత్ నుంచి పలు సందర్భాల్లో మాల్దీవులు సాయం పొందింది. ప్రస్తుతం సుమారు రూ.417 కోట్ల రుణాన్ని భారత్ కు మాల్దీవులు చెల్లించాల్సి ఉంది. ఆ లోన్ ను తీర్చేందుకు తమకు ఇంకాస్త సమయం కావాలని మాల్దీవులు ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరడంతో రూ.417 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో సంవత్సరం సమయాన్ని భారత్.. మాల్దీవులకు ఇచ్చింది. 

మరో ఏడాది పాటు ఎలాంటి వడ్డీ కట్టకుండానే ఆ రుణాన్ని వాడుకోవచ్చని.. ఏడాది తర్వాత ఎలాంటి వడ్డీ లేకుండా ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయొచ్చని భారత్.. మాల్దీవులకు సాయం చేయడంతో మాల్దీవులు ప్రభుత్వం.. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. 

అయితే.. మాల్దీవులు ప్రెసిడెంట్ ముయిజ్జు ఇటీవల.. భారత్ కు చెందిన సైనిక బలగాలను.. తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని ఒత్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ బలగాలు.. మాల్దీవుల నుంచి ఉపసంహరించుకున్నారు. ఈనేపథ్యంలో కూడా భారత్.. మాల్దీవులకు తోడుగా నిలిచింది. దీంతో.. మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రి ముసా జమీర్.. భారత విదేశీ మంత్రి జైశంకర్ కు ధన్యవాదాలు తెలిపారు. 

142 -3

నిజానికి చైనాకు అనుకూలంగా వ్యవహరించే ముయిజ్జు మాల్దీవులకు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అంతకుముందు మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలు బాగుండేవి. ఈ మధ్య క్షీణించినా కూడా భారత్.. అవేవీ పట్టించుకోకుండా.. మాల్దీవులకు సాయం చేసింది. 

మే 8 నుంచి 10 వరకు భారత్ లో పర్యటించిన మాల్దీవులు విదేశీ శాఖ మంత్రి.. భారత్ చేసిన సాయాన్ని పొడిగించాలని కోరడంతో భారత్ కూడా పాజిటివ్ గా స్పందించింది. మాల్దీవుల అభ్యర్థనకు ఒప్పుకుంది. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?