Karthika Masam 2024: శివుడికి అత్యంత ఇష్ట‌మైన కార్తీకమాసం విశిష్టత ఏంటో తెలుసా?

Karthika Masam 2024: శివుడికి అత్యంత ఇష్ట‌మైన కార్తీకమాసం విశిష్టత ఏంటో తెలుసా?

Karthika Masam 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్తీకమాసం అనేది ఎంతో ఘనంగా దైవభక్తితో జరిపిస్తారు. కార్తీకమాసం నవంబర్ రెండవ తేదీ నా ప్రారంభమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మాసాన్ని హిందువులు పరమ పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా కార్తీక్ మాసం బోలా శంకరుడికి అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెబుతారు. మిగతా మాసాలతో పోలిస్తే కార్తీక మాసానికి ఎంతో విశిష్ట అనేది ఉంది. ఈ విశిష్టత గురించి ఈ స్కంద పురాణంలో కూడా రాసి ఉండడం మరొక విశేషం. కార్తీకమాసానికి సరైన మాసం లేదని ప్రతి ఒక్కరు చెబుతున్న విషయమే. 


ఈ కార్తీకమాసంలో పూజలు మరియు వ్రతాలు అలాగే ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం అనేది ప్రతి ఒక్కరి ఇంటిలో నెలకొంటుంది. నెలరోజులపాటు వర్మ పరమేశ్వరుడైనటువంటి శివుడిని భక్తుతో పూజిస్తూ ఉంటారు. అలాగే సోమవారాలు మరియు ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు అలాగే పూజలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉపవాసం ఉంటూ సాక్షాత్తు అపరమేశ్వరుడి కటాక్షం కోసం వేచి చూస్తూ ఉంటారు. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి అందుకే కార్తీకమాసం అనే పేరు వచ్చింది. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?


 అంతేకాకుండా ఈ కార్తీకమాసంలోని అయ్యప్ప మాలలు అనే దీక్షలు ఎక్కువగా చేస్తారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళ దైవాన్ని మాల ద్వారా దీక్షలనేవి దాదాపుగా నెలపాటు చేస్తారు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశిష్ట గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ ఏడాది కార్తిక మాసం నవంబర్ 15న వస్తున్నది. ఆరోజున నదుల్లో స్నానాలు చేసే శివుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. 

Read Also రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..

అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో దీపాలను  వెలిగించి సాక్షాత్తు ఆ  మహాశివుడిని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక్ దీపాలను నదుల్లో కూడా వదులుతారు. కాబట్టి కార్తీక మాసంలో ఎక్కువగా దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్లి పూజలు చేసేది ఎందుకంటే దోషాలు తొలగిపోతాయని అలాగే బాధలు ఉండవని నమ్మకంతో చేస్తారు. అలాగే ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 

Read Also రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

03 -02
ఈ కార్తీకమాసంలో దీపదానం చేస్తే ఇంటి చీకటితో పాటు జీవితంలో అలుముకున్నా చీకట్లు కూడా తొలగిపోతాయని...అంతేకాకుండా లక్ష్మీదేవి సంతోషించి ఇంటిని సిరిసంపదలతో నింపుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతారు. హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుని ఎంతో పవిత్రంగా భావిస్తూ పూజలు చేస్తారు. ఈ కార్తీకమాసంలోని ఒక నెలపాటు తులసి చెట్టు ఎదుట దీపం పెడితే అపారమైన పుణ్యం లభిస్తుందని పండితులు చాలా విధాలుగా చెప్పారు. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కూడా పూజలు చేస్తుంటారు. 

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  


ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైందని చెప్తారు. అందుకే చాలామంది ఉసిరి చెట్ల కింద భోజనాలు చేస్తారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఉసిరి చెట్టు కింద కార్తిక దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసంలోనే ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తిగా ఇష్టమైన దైవాలకు ప్రతిరోజు నిత్యం పూజలు అలాగే దీపరాధనలు చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా మాల ధరించేటువంటి భక్తులు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో ఆచారాలను పాటిస్తూ దైవ భక్తుని చాటుకుంటారు. 


కాబట్టి ఈ కార్తీకమాసం అనేది ఎంత విశిష్టమైనది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు ఆ దేవులకే ఈ కార్తీకమాసం అంటే ఎంతో ఇష్టమైనదని ఎన్నో పురాణాల్లో అలాగే మన వేద పండితులు కూడా చెబుతున్న విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక్ మాసంలో వాళ్లకి తోచినంతగా దైవ భక్తి లో మునిగిపోవాలని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తిక మాసంలో ఇష్టంతో వాళ్ల యొక్క కుటుంబ దైవానికి ఘనంగా పూజలు, అభిషేకాలు చేస్తారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?