Test cricket: టీమిండియా స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్.... ఆటగాళ్ల వేటు పై బీసీసీఐ సంచలన నిర్ణయం ?

Test cricket: టీమిండియా స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్.... ఆటగాళ్ల వేటు పై బీసీసీఐ సంచలన నిర్ణయం ?

Test cricket: వాంకిడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన క్రికెట్లో భారత్ 25 పరుగులు తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి ఏకంగా టెస్ట్ సిరీస్ నే కోల్పోయింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా కేవలం 29.1 ఓవర్లలోనే  121 పరుగులకు కుప్పకూలి  క్రికెట్ అభిమానులందరినీ కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. 

 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  

 రిషబ్ పంతు ఒంటరి పోరాటం చేసినా కూడా మిగిలిన బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలమయ్యారు. రిషబ్ పంత్ వండే తరహాలో 63 పరుగులు చేశాడు. కానీ థర్డ్ ఎంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల అవుట్ అయ్యాడని  ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఏ బి డివిలియర్స్ కూడా ఈ విషయంపై స్పందించి తార్డ్ ఎంపైర్  దే తప్పిదమని తెలిపారు.

Read Also రోబో డాగ్ ను ఆసక్తికరంగా వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులు!

 

 టీమిండియా  ఘోర పరాజయం తర్వాత  బిసిసిఐ అణాధికారికి సమావేశాన్ని నిర్వహించింది. మైదానంలోనే టీమ్ ఇండియా కోచ్ అయినటువంటి  గౌతమ్ గంభీర్ తో చీఫ్ సెలెక్టర్ అజిత్ సుదీర్ఘంగా చర్చించారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో సహా నలుగురు సీనియర్లపై వేటుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్లలో కనీసం ఇద్దరిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుందని సమాచారం అందింది. 

05 -02

 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు టీమ్ ఇండియా అర్హత సాధించకపోతే ఈ స్టార్ ఆటగాళ్లపై ఖచ్చితంగా వేటు  వేయాలని బోర్డు నిర్ణయించుకుందని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. డబ్ల్యూటీసి ఫైనల్స్ అనంతరం జరిగే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సీనియర్లు లేకుండా జట్లు పంపించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ఇప్పటికే ఎంపిక చేయడంతో తర్వాత ఇంగ్లాండ్తో జరుగునున్న టెస్ట్ సిరీస్ లో మార్పులు చేపట్టనున్నట్లు చెప్పారు. 

 

 రోహిత్ గత పది ఇన్నింగ్స్ లో ఆరుసార్లు సింగల్ డిజిట్ కే పరిమితమవడంతో అందరూ కూడా మండిపడుతున్న విషయం తెలిసిందే. రెండుసార్లు 20 కంటే తక్కువ స్కోరుకే వెను తిరిగాడు. మరో వైపు స్వదేశంలో కోహ్లీ గత 25 ఇన్నింగ్స్ లో  కేవలం  742 పరుగులు మాత్రమే చేశాడు. ఇక భారత్ డబ్ల్యుటిసి ఫైనల్స్ కు క్వాలిఫై కావాలంటే  ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టులు సిరీస్ ను 4-0 కచ్చితంగా గెలవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలు పై ఆధారపడకుండా టైటిల్ పోరుకు చేరుతుంది. నవంబర్ 22 నుంచి 5 టెస్టులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైతున్న విషయం మనందరికీ తెలిసిందే.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?