woman left her baby : ఆడపిల్ల పుట్టిందని బిడ్డను వదిలేసిన త‌ల్లి... 20 ఏండ్ల‌ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్...

woman left her baby : ఆడపిల్ల పుట్టిందని బిడ్డను వదిలేసిన త‌ల్లి... 20 ఏండ్ల‌ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్...

 ఇది ఒక తల్లి తనకు పుట్టిన బిడ్డ ఆడపిల్లని తెలిసి అక్కడే వదిలేసి వెళ్లిన సంఘటన. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అదే తల్లి ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ పిల్ల తన తల్లిని గుర్తుపట్టిందా.. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం.. ఈ సంఘటన గుజరాత్ లోని వడోదరలో జరిగింది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి ఒకరోజు రాత్రి ఒక గర్భిణీ వచ్చింది. చూస్తుంటే డెలివరీ కి దగ్గరలో ఉన్నట్టుగా అక్కడి డాక్టర్లకు అర్థమైంది. అయితే అక్కడ వారు గమనించిన విషయం ఏమిటంటే ఆ మహిళతో పాటు ఎవ్వరూ లేకపోవడం అసలు ఎవరైనా సరే అలాంటి సమయంలో తోడుగా వస్తారు అని విచిత్రం ఏంటంటే ఆ మహిళ ఒక్కతే రావడం వైద్యులు వెంటనే ఆమెను డెలివరీ కోసం తీసుకువెళ్లారు. కొంచెం సేపటి తర్వాత మహిళ ఒక అందమైన ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ మహిళతో ఎవరు రాని కారణంగా మరుసటి ఉదయమే వారిని డిశ్చార్జ్ చేద్దామని డాక్టర్లు అనుకున్నారు. అయితే మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తే అక్కడ మహిళ లేదు. తనకు పుట్టిన పాపను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఇది చూసినా అక్కడ వైద్యుల ఆశ్చర్యపోయారు. అసలు ఆ మహిళ ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు. ఆ మహిళ కోసం ఎంతో గాలించారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి సమాచారం వారికి లభించలేదు. పాపను మాత్రం అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ మహాతల్లి అయినా ఈ విధంగా ఎవరికి చేయాలనే ఉంటుంది చెప్పండి. ఎంత వెతికినా మహిళ జాడ మాత్రం వారికి తెలియలేదు. ఇక ఏమి చేయాలో అక్కడ వారికి అర్థం కాలేదు. ఇక చేసేది ఏం లేక అక్కడి వైద్యులు పోలీసులకు ఫోన్ చేసి జరిగింది.  వారు కేసు అయితే రిజిస్టర్ చేసుకున్నారు. పాపను మాత్రం ఏదైనా అనాధ శరణాలయానికి పంపించాలని అక్కడి వైద్యులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు అయితే అదే ఆసుపత్రిలో సీమ అనే నర్స్ పనిచేస్తుంది. సీమకు పెళ్ళైతే కూడా ఇంతవరకు తనకు పిల్లలు లేరు. చేయని పూజ లేదు. మోక్కని గుడి లేదు. కానీ పాపం పిల్లలు మాత్రం కలగలేదు. సీమ వెంటనే అక్కడి వైద్యులతో నేను ఈ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పింది.

 వారు కూడా సరే అని ఒప్పుకున్నారు. ఆ పాపను చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి దత్తత తీసుకుంది. ఆ తర్వాత సీమ ఆ పాపకు శ్వేత అని పేరు పెట్టింది. అలా సీమ ఎంతో అల్లారు ముద్దుగా శ్వేతను చూసుకునేది కాలం గడిచే కొద్దిదవుతూ వచ్చింది. శ్వేతకు చిన్నతనం నుంచే డాన్స్ అంటే బాగా ఇష్టమని సీమ గమనించింది నేర్పించింది. అనేక నృత్య పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు కూడా గెలిచింది. శ్వేత ఆమెకి ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు శ్వేత సొంతంగా డాన్స్ ఇన్స్టిట్యూట్ ని కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడే శ్వేత జీవితంలో తుఫాను రాబోతుందనే విషయం శ్వేతకు తెలియదు. నిజానికి శ్వేతకు 20 ఏళ్లు వచ్చినా కూడా ఆమె తల్లి సీమ మాత్రం ఇప్పటికీ అదే ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తూ ఉంది. అయితే శ్వేతను పుట్టిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయిన అదే మహిళ ఇప్పుడు అస్వస్థతతో అదే ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అది యాదృచ్ఛికము శివుడి అద్భుతమో ఆ దేవుడికి తెలియాలి. అయితే అక్కడే ఉన్న సీమ వెంటనే ఆ మహిళలను గుర్తించి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. పోలీసులు వెంటనే వచ్చి ఆ మహిళను విచారించగా ఆమె తన తప్పును అంగీకరించింది. అయితే అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిందో మొత్తం వివరంగా పోలీసులకు మరియు సీమకు చెప్పింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అప్పటికే తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని నేను నాలుగో సారి గర్భవతిని అయ్యానని వారికి చెప్పింది. అయితే నాలుగో సారి కూడా నా కడుపులో పెరుగుతున్నది కూతురని నా కుటుంబ సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

ఐతే మరోసారి కూతురు పుడితే మాత్రం మేము సహించమని వారు తెగేసి చెప్పారట. ఒకవేళ వాళ్ళ సమక్షంలోనే కూతురు పుడితే వారు చంపేస్తామని చెప్పారు. ఇక చేసేదేం లేక అలా తొమ్మిదో నెలలో రాత్రి కడుపు నొప్పి రావడంతో నేను ఒంటరిగానే ఆసుపత్రికి వచ్చాను. ఇక్కడ నాకు ఆడపిల్ల పుట్టింది. కానీ నేను ఆమెను ఇంటికి తీసుకెళ్తే ఈ వ్యక్తులు నా కుమార్తెను చంపేస్తారని నాకు తెలుసు. కానీ చేసేది లేక నేను పాపను ఇక్కడ వదిలివేస్తే ఎవరైనా ఆమెను కచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో దత్తత తీసుకుంటారు అనుకున్నాను.. అని చెప్పింది దీనిపై సేవ మాట్లాడుతూ మీరు చెప్పింది. పూర్తిగా నిజమేనని గత 20 ఏళ్లుగా మీ కూతురు నాతోనే ఉందని చెప్పింది. ఆ తర్వాత సేమ్ ఆ శ్వేతకు ఫోన్ చేసింది. ఆమె నిజమైన తల్లికి పరిచయం చేసింది. సీమ ఎందుకంటే శ్వేత సీమ  నిజమైన తల్లిగా భావించింది. కాబట్టి అయితే ఆ మహిళ యొక్క బాధను చూసి నన్ను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. నిజానికిభారతదేశంలో ఆడపిల్లలను ఎందుకు భారంగా భావిస్తారో ఎవ్వరికీ అంతు పట్టని ప్రశ్న ఇది. వినడానికి చాలా విడ్డూరంగా ఉంటుంది. ఆడపిల్లలు లేకపోతే మనమెవ్వరం కూడా ఉండము కదా. కూతురు వలన వంశం వృద్ధి చెందుతుంది. కష్ట సమయంలో కూతురు ఆదరించినట్టు కొడుకులు కూడా ఆదరించరు. ఈ విషయం చాలామందికి తెలుసు.. అయినా ఎప్పటికీ పుట్టిన పిల్లలను పురిట్లోనే చంపేస్తున్నారు. లేక వదిలేసి వెళ్ళిపోతున్నారు. సీమ లాంటి మహిళలు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇప్పటికైనా సమాజం మారాలి..

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?