Sleeping Late at Night : రాత్రి ఆలస్యంగా నిద్రపోతే ఏం జరుగుతుంది.. నిపుణులు చెప్పిన భయంకర నిజాలు..

Sleeping Late at Night : రాత్రి ఆలస్యంగా నిద్రపోతే ఏం జరుగుతుంది.. నిపుణులు చెప్పిన భయంకర నిజాలు..

Sleeping Late at Night : ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలం చాలా మారిపోయింది. ఒకప్పుడు అయితే రాత్రులు తొందరగా పడుకునేవారు. వీలైనంతవరకు కూడా రాత్రి 8 గంటల కల్లా తినేసి 9 గంటలకు  పడుకునేవారు. కానీ ప్రస్తుతం ఉద్యోగాల శైలి మారటం వలన మరియు జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి.

దీంతో స్మార్ట్ ఫోన్ లు మరియు ఓటీటీ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని వలన చాలామంది కూడా రాత్రులు చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. కొందరు పనుల్లో బిజీగా ఉన్నట్టే, మరి కొందరు మాత్రం స్మార్ట్ ఫోన్లతో కుస్తీలు పడుతూ ఉంటారు. దీనితో ఆలస్యంగా నిద్రపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.

ముఖ్యంగా రాత్రి 11 గంటల తర్వాత కూడా మెలుకువతో ఉండే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. అయితే ఇలా ఆలస్యంగా నిద్రపోవటం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని   నిపుణులు తెలిపారు..

154 -2

రాత్రి టైంలో ఆలస్యంగా నిద్రపోవటం వలన మన శరీర గడియారం అనేది దెబ్బతినే అవకాశ ఉంటుంది అని తెలిపారు. మన శరీర గడియారం మనకు ఎప్పుడు నిద్రపోవాలి మరియు ఎప్పుడు మేలుకోవాలి అనే విషయాల గురించి తెలుపుతుంది. అయితే ఇష్టం వచ్చిన టైమ్ లో పడుకొని,ఇష్టం వచ్చిన టైంలో నిద్ర లేవటం వలన సహజ టైమర్ కు అంతరాయం కూడా ఏర్పడుతుంది అని నిపుణులు తెలిపారు.

ఇది మన శారీరక ఆరోగ్యం పై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అని తెలిపారు. ప్రతి నిత్యం అలిసిపోయినట్లు అనిపించడం లేక బరువు పెరగటంతో పాటుగా నిత్యం అనారోగ్య సమస్యల బారిన పడటం లాంటి సమస్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది మన మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతుంది అని అంటున్నారు.

ఆలస్యంగా నిద్రపోయే వారిలో ఆందోళన మరియు నిరాశ సమస్యలు పెరుగుతాయి అని అంటున్నారు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జనరల్ మెడికల్ సైన్స్ ప్రకారం. ఈ జీవ గడియారంలో మార్పులు వచ్చి రోగ నిరోధక వ్యవస్థ పై నేరుగా ప్రభావం పడుతుంది అని తెలిపారు.

154 -3

ఇక వేక్ ఫిట్ కి చెంది ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డు నివేదిక ప్రకారం చూసినట్లయితే. మన భారత దేశంలో 58% మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు అని తేలింది. రాత్రి టైమ్ లో ఆలస్యంగా నిద్రపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాటిలలో ప్రధాన కారణమైన స్మార్ట్ ఫొన్ మరియు టీవీలు మరియు గ్యాడ్జెట్స్ లు ప్రధాన కారణాలుగా ఉన్నాయి అని తెలిపారు.

సుమారుగా 88% మంది భారతీయులు పడుకునే ముందు ఫోన్ ను పట్టుకుంటున్నారు అని తెలిపింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ మరియు ముంబై, గురుగ్రామ్ లాంటి ప్రధాన నగరాలలో అర్ధరాత్రి వరకు కూడా డ్యూటీలు చేయటం వలన కూడా వారి నిద్ర వేళల్లో మార్పులకు కారణం అవుతున్నాయి అని తెలిపారు.

భారతదేశంలో సుమారు 30 శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు  తెలిపారు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?