Wake Up: ఉద‌యం లేవ‌గానే ఎవ‌రి ముఖం చూడాలి.?.. వేటిని చూడ‌కూడ‌దు..?

Wake Up: ఉద‌యం లేవ‌గానే ఎవ‌రి ముఖం చూడాలి.?.. వేటిని చూడ‌కూడ‌దు..?

Wake Up:  మనం ప్రతిరోజు ఉదయం లేవగానే  ఏదో ఒక పని చేసుకుంటూ మళ్లీ తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చి చేరుతాం. అలా వచ్చి రాగానే వెంటనే ఆ రోజు మంచి జరిగితే హమ్మయ్య అనుకుంటూ  ఒకవేళ మంచి జరగకపోతే ఈరోజు ఉదయం ఎవరి ముఖం చూసానో ఏమో ఇలా జరిగిపోయింది అని సహజంగా చాలామంది బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివారిని మీ ఇంట్లోనూ లేదో పక్కింట్లోనో చూసే ఉంటాం. కాబట్టి మనందరం ఇప్పుడు ఒక విషయంతెలుసుకుందాం. అయితే ఉదయం లేవగానే ఎటువంటి వస్తువులను లేదా ఏమి చూడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 ఉదయం లేచిన వెంటనే ఏమి చూడాలి

 మనం ప్రతిరోజు లేవగానే ఏదో ఒక పని మీద ఎక్కడికో అక్కడికి వెళుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు శుభం జరగవచ్చు మరి కొన్నిసార్లు అశుభం జరగవచ్చు. అయితే వీటన్నింటికీ కూడా ఉదయాన్నే లేచినటువంటి సందర్భంలో ఏమి చూస్తామో అనేదానిమీద కూడా ఆధారపడి ఉంటుందని కొంతమంది శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం లేచిన వెంటనే మన అరచేతిని చూసుకోవడం వల్ల చాలా లాభాలు కలుగుతాయని  అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని జరుగుతుందని  అందరూ అంటుంటారు. అలాగే నిద్రలేచిన వెంటనే భూదేవిని చూడడం ఆ భూదేవికి నమస్కారం చేయడం అనేది చాలా అవసరం అని  ఇందువల్ల రోజు మొత్తం ప్రశాంతంగా ఏ పనైనా విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు. 

అలాగే పురుషులు ఉదయం లేచిన వెంటనే మొదటగా  అమ్మ, భార్యలను లేదా పిల్లలను చూడడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సరే ఉదయం లేవగానే బయటికి వచ్చి చూసిన వెంటనే గోమాత దూడకు పాలు ఇవ్వడం లేదా  గోమాతలను చూడడం వల్ల  మన పాపాలన్నీ పోతాయని చెప్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు మనం నిద్రలేచిన వెంటనే బల్లిని చూడడం వల్ల  ఆరోజు మనకి శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  ఉదయం లేచిన వెంటనే ఉదయించే సూర్యుడిని చూడడం చాలా మంచిదని  అలా చూడడం వల్లరోజు మొత్తం ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండవచ్చని చెప్తున్నారు. 

28 -15

అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచే ముందే గుడిలో ఉన్నటువంటి సుప్రభాతాలు లేదా గుడి గోపురం చూడడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అలాగే భవిష్యత్తులో మంచిగా ధనం పరంగా అదృష్టం కలుగుతుందని శాస్త్ర  పండితులు చెబుతున్నారు. అయితే వీటన్నిటికన్నా గొప్పగా ఉదయాన్నే లేచిన వెంటనే తులసి మొక్క లేదా గోవులను చూస్తే చాలా శుభం కలుగుతుందని  వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ తులసి మొక్కలను అలాగే ఆవుల లోను దేవతలు ఉంటారు కాబట్టి వీటిని ఉదయాన్నే లేచిన వెంటనే చూడటం వల్ల భవిష్యత్తులోనే కాకుండా ఇప్పుడు కూడా తరతరాలు పట్టలేనంత అదృష్టం కలిగి ఉంటారని చెబుతున్నారు. 

అయితే ఇంతే కాకుండా ఉదయం లేచిన వెంటనే మనం బంగారు లేదా వెండి లేదా ఎర్రచందనం వంటివి చూస్తే మనకి ఆ రోజు వారి పనులు జరగడమే కాకుండా వాటి వల్ల మంచి లాభాలు కూడా కలుగుతాయని చెప్తూ ఉన్నారు. అలాగే ఉదయం లేచిన వెంటనే ఆకాశం నీలిరంగులో ఉన్నటువంటి సమయాన్ని మనం చూసినట్లయితే ఆరోజు చాలా ప్రశాంతంగా ఉండడంతో పాటు  అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయని చెబుతున్నారు.  వీటితోపాటుగా సప్తవరణాలు ఉన్నటువంటి ఇంద్రధనస్సు చూస్తే జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారని చెబుతున్నారు. 

 ఉదయాన్నే లేచిన వెంటనే చూడకూడనివి

 మనం మన జీవితంలో ఉదయాన్నే కొన్ని వస్తువులను అలాగే కొంతమందిని చూడడం వల్ల ఆరోజు చాలా వినాశనాలు కలుగుతాయని వేద పండితులు చెప్పుకొస్తున్నారు. అయితే వీటిల్లో ఇలా చేయడం వల్ల చాలానే జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు లేచిన వెంటనే కొన్ని చూడకూడానవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

28 -12

 మొదటిగా ఉదయాన్నే లేచిన వెంటనే పాపం చేసినటువంటి వారిని చూడటం వల్ల మనకు కూడా పాపము అంటుకుంటుందని చాలామంది పెద్దలు చెబుతూనే ఉంటారు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఎవరు కూడా పాపాలు చేసినటువంటి వ్యక్తులను చూడకూడదు. అలాగే బొట్టు పెట్టుకొన్నటువంటి స్త్రీలను మరియు జుట్టు విరబోసుకొని ఉన్నటువంటి స్త్రీలను చూడకూడదు అని పండితులు చెబుతున్నారు. 

ప్రస్తుతరంలో ఎక్కువగా ఇళ్లలో జంతువుల యొక్క కొమ్ములను అలాగే పనికిరాని అటువంటి వస్తువులను గోళ్ళకు తొలగిస్తూ ఉంటారు వాటిని చూడటం వల్ల మనకి చెడు జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రం చేయునటువంటి వస్తువులను అలాగే వంట సామాగ్రిని చూడడం వల్ల మనకి ఆరోజు మొత్తం ఏదో భరించలేనటువంటి బాధ్యతలు వస్తాయని చెబుతున్నారు. కొందరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుంటే ఆరోజు మొత్తం బాధలతో మునిగిపోతారని వేద పండితులు చెప్తున్నారు. 

28 -13

అలాగే ఉదయాన్నే మీ యొక్క నీడను మీరు చూసుకోవడం మంచిది కాదట. ఇంకొంతమంది ఉదయం లేవగానే జుట్టును దువ్వుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం  మంచిది కాదని పండితులు చెప్తున్నారు. అలా ఉదయాన్నే దువ్వడం వల్ల ఆరోజు మొత్తం దరిద్రం మీ వెంట ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే పళ్ళు తోముకోకూడదని అలాగే పళ్ళు తోముకోవడం కూడా ఎవరూ చూడకూడదని అలా చూడకపోవడమే మంచిది పండితులు చెప్తున్నారు. 

అలాగే ఎవరూ కూడా ఎండలో పళ్ళు తోముకూడదని అలా చేయడం వల్ల ఇంట్లో ధనం కూడా ఎక్కువగా నిలబడదని పండితులు చెప్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఒకరి మంచి జరిగిందంటే అవి వీటిల్లో ఉన్నవి చూసుకొని గమనించాలని పండితులు చెబుతున్నారు. ఇలా ఉదయం లేచిన వెంటనే కొన్ని చూడకూడదు కొన్ని చూడవలసినవి సరిగ్గా పాటిస్తే జీవితం మొత్తం సుఖంగా మంచిగా సాగుతుందని పండితులు చెబుతున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?