PM Modi Praises ED Officials :  కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులను మెచ్చుకున్న ప్రధాని.. అవినీతిని అరికట్టడంలో ఈడీ పాత్రను కొనియాడిన మోదీ  

PM Modi Praises ED Officials :  కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులను మెచ్చుకున్న ప్రధాని.. అవినీతిని అరికట్టడంలో ఈడీ పాత్రను కొనియాడిన మోదీ  

PM Modi Praises ED Officials : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశ వ్యాప్తంగా ఒకటే చర్చ. అదే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వెంటనే కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమెకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత అరెస్ట్ చట్టబద్ధమే అని.. ఇందులో ఎక్కడా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయలేదని అవెన్యూ కోర్టు తెలిపింది.

కవిత అరెస్ట్ పై తెలంగాణ వ్యాప్తంగా పలు ఆందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. కవితను అరెస్ట్ చేయడానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కేటీఆర్ అడ్డుకోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆయనపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే... ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఆయన నేరుగా కవిత అరెస్ట్ పై స్పందించినప్పటికీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

అవినీతి నిర్మూలన కోసం, అవినీతిని అరికట్టడం కోసం ఈడీ అధికారులు తిరుగులేని నిర్ణయాలు తీసుకొంటున్నారని.. కఠినంగా ముందుకు వెళ్తున్నారని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారని మోదీ కొనియాడారు.  

PM Modi Praises ED Officials : అవినీతి రహిత భారత్ కోసమే మా తాపత్రయందేశంలో అవినీతి అనే పదమే వినిపించకూడదు. అవినీతి విషయంలో, దాన్ని ప్రోత్సహించే వాళ్ల విషయంలో అస్సలు తగ్గేదే లేదు. అవినీతికి పాల్పడే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టం.. అని మోదీ ఉటంకించారు. అవినీతిని అరికట్టడంతో ఈడీ అధికారులు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈడీ కావచ్చు.. సీబీఐ కావచ్చు.. మరే సంస్థ అయినా సరే.. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు, ఇతర నాయకులకు ఎవ్వరికీ తలవంచకుండా తన పని చేసుకుంటూ వెళ్తుందన్నారు. 

moo

2014 కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంస్థలు అవినీతి నిర్మూలనలో తమ వంతు పాత్రను పోషించలేకపోయాయని అందుకే అప్పట్లో అవినీతి బయటికి రాలేదన్నారు. 2014 వరకు ఈడీ అధికారులు కేవలం 1800 కేసులు మాత్రమే రిజిస్టర్ చేయగలిగారని.. కానీ.. 2014 నుంచి 2024 మార్చి వరకు 4700 కేసులు రిజిస్టర్ చేశారని మోదీ అన్నారు. 

2014 వరకు కేవలం 5 వేల కోట్ల అవినీతి సొమ్మును మాత్రమే అధికారులు సీజ్ చేశారని.. కానీ.. గత పదేళ్లలో అధికారులు లక్ష కోట్ల అవినీతి సొమ్మను పట్టుకున్నారని మోదీ స్పష్టం చేశారు. టెర్రర్ ఫైనాన్సింగ్, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, ఇతర నేరాల్లో నిందితులుగా ఉన్న చాలామంది ప్రముఖులను అరెస్ట్ చేసి 100 కోట్ల వరకు అవినీతి సొమ్మను జప్తు చేశారని మోదీ తెలిపారు. 

ఇలాంటి సంస్థలే మన దేశానికి కావాలి. ఇది కొందరు వ్యక్తులకు సమస్యలను తీసుకొస్తుంది. అందుకే ఉదయం లేస్తే మోదీనే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అయినా కూడా దేశమంతా ఒక్కటై అవినీతిని పారదోలే అధికారులకు మద్దతు పలుకుతోంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు పేపర్ల మీద రాతలు రాసి కలలు కంటుంటారు. కానీ.. మోదీ మాత్రం కలలను గ్యారెంటీలుగా మార్చడంలో ప్రముఖ పాత్ర  పోషిస్తున్నారు..

అంటూ మోదీ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024 లో పాల్గొన్న మోదీ పై వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. మీకు కూడా ఎన్నికల సమయంలోనే ఈడీ అధికారులు గుర్తుకొస్తారా? అప్పుడే ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తారా? అంటూ మోదీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?