దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడాలి

కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున

దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడాలి


802
నల్లగొండ పెద్ద గడియారం చౌరస్తాలో అర్థనగ్న ప్రదర్శన
మిగతా సంక్షేమ పథకాల లాగానే దళిత బంధును కొనసాగించాలి
నల్లగొండ. ఫిబ్రవరి 8 క్విక్ టుడే (ప్ర‌తినిధి) : దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారులు పేదరిక రేఖకు దిగువన ఉన్న దళితులను దళిత బంధు పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్ తో గురువారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళిత బందు బాధితులతో నల్లగొండ పెద్ద గడియారం చౌరస్తాలో   పెద్ద ఎత్తున  అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడగు నాగార్జున మాట్లాడుతూ దళిత బందుకు ఎంపిక కాబడిన లబ్ధిదారులకు గ్రౌండ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ మొత్తం జరిగిందని విడుదల చేసే నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని వారన్నారు.

నల్లగొండ నియోజకవర్గం లోని 1055 మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందని, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలి గౌరారం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 270 మంది ని దళిత బంధు పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని వారన్నారు. గ్రామ కార్యదర్శుల,ఎంపీడీవోల నల్లగొండ మునిసిపల్ అధికారుల సమక్షంలో ద్వారా  లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినందువలన యధావిధిగా సాగాల్సిన గ్రౌండింగ్ ప్రక్రియ ఆగిపోయినది. ఎన్నికల కోడ్ ముగిసి నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది. ఐనా మాకు రావాల్సిన దళిత బంధు నిధులను రీలిజ్ చేయలేదన్నారు..కావునా నిధులను మంజూరు చేయుటకు వేగవంతం గా గ్రౌండ్ చేసి జీవనోపాధి పొందుటకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేయాలని కోరారు.డిసెంబర్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే కొనసాగిస్తుందో అదే తరహలో దళిత బంధు పథకాన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను కొనసాగిస్తూ ఒక దళిత బంధు పథకం విషయమంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందో స్పష్టం చేయాలన్నారు.

దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులు ఆర్థికంగా పురోభివృద్ధి చెందడానికి ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలను అగ్గిపాలు చేయకుండా ఎక్కడనైతే ప్రక్రియ ఆగిపోయిందో అక్కడనుండి పున ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అంబేడ్కర్ అభయహస్తం క్రింద 12 లక్షల రూపాయలను దళిత బంధు లబ్ధిదారులకు మంజూరు చేసి వారి ఆదరాభిమానాలను పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించని యెడల దళిత బహుజన సామాజిక ప్రజా సంఘాలను కలుపుకొని దళిత బంధు బాధితుల ఉద్యమాన్ని రాష్ట్రస్థాయి ఉద్యమంగా మలుచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ప్రదర్శనగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళగా అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వెనుతిరి గారు.ఈ కార్యక్రమంలో బడుపుల శంకర్,అద్దంకి రవీందర్, గాదే నరసింహ, కట్టెల శివ కుమార్ , మామిడి రమేష్, పోతే పాక నవీన్, పిచ్చయ్య ,నాగయ్య  బొల్లు రవీందర్, బొల్లెద్దు నాగయ్య, సైదులు, కిన్నెర అంజి,యన్నమల్ల వెంకటేశం,  మైనం నాగేందర్ ,గోలి రమేష్ ,యాదయ్య , తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?