Medipally : మేడిపల్లిలో 2024 సీపీఐ పార్టీ సభ్యత్వం నమోదు
On
Medipally : మేడిపల్లి, క్విక్ టుడే : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2024, సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మేడిపల్లి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో ఈ సభ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రచ్చ కిషన్ మాట్లాడుతూ.. ఈ సభ్యతంను కార్మికులు, కర్షకులు, వివిధ రంగాలలో ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సిపిఐ పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. సిపిఐ పార్టీ పేదల పక్షాన నిలబడి, పేదల కోసం పనిచేస్తుందన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిలదీస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండలం ఏఐటీయూసీ కార్యదర్శి దండు రమేష్, ఇంద్రానగర్ శాఖ కార్యదర్శి మాచర్ల కనకయ్య, సిపిఐ పార్టీ సభ్యులు వెంకటమ్మ, లక్ష్మీ, మణెమ్మ, సుజాత, రమేష్, ఎన్. ఆంజనేయులు, ఎన్.రజిత, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...