Burri Srinivasa Reddy : క్లాక్ ట‌వ‌ర్ సెంట‌ర్‌లో కేసీఆర్ మోసాల‌ను వివ‌రిస్తాం

-ఎల్ఈడి స్క్రీన్‌ల నల్లగొండ ప్రజలకు తెలియ‌జేస్తాం

Burri Srinivasa Reddy : క్లాక్ ట‌వ‌ర్ సెంట‌ర్‌లో కేసీఆర్ మోసాల‌ను వివ‌రిస్తాం




Burri Srinivasa Reddy : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 12 (క్విక్ టుడే) : కృష్ణా నది నుండి ఏపీకి నీటిని అందించింది కేసీఆర్ అన్న సంగతి అందరికీ తెలుసునని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఎందుకు పెడుతున్నారు వారికే అర్థం కావడం లేదని విమర్శించారు.

అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో నల్లగొండలో ఏమి పట్టించుకోకుండా నాశనం చేసి మళ్లీ మాయమాటలు చెప్పడానికి వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నలగొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ కంటే ముందు తాను గడియారం సెంటర్లో 10 గంటలకు మీటింగ్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడిన అబద్ధాలు, నాటకాలు ప్రజలకు వివరించి తెలియజేస్తామని వెల్లడించారు, సాగునీరు కోసం 2008లో 600 కోట్లతో నాటు ముఖ్యమంత్రి వైయస్సార్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రారంభించారని 90 శాతం పూర్తి అయిన పల్లెను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఒక్క పైసా కేటాయించకుండా నల్లగొండ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. తమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని, జిల్లాలో ఉన్న ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోలేదని ఘాటుగా విమర్శించారు.

నల్లగొండ దత్తత తీసుకుంటాను అన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నల్లగొండలోని ఒక హైదరాబాద్ రోడ్డు ఒకటి మాత్రమే బాగు చేశారన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తదని వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇప్పటికే రెండు చేశామని మరొక రెండు నెలల్లో అన్ని అమలు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నల్లగొండ జడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య  నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ . నాయకులు పాశం సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి ఇంతియాజ్,శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సుందర్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?