LV Yadav : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి

టీడీపీ నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జి ఎల్వీ యాదవ్

LV Yadav : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి



నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 13(క్విక్ టుడే) : కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందున కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, ప్రైవేట్ పరం మానుకోవాలని టిడిపి నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జి ఎల్వి యాదవ్ కోరారు. ఫిబ్రవరి 16 న నిర్వహించే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని  టి ఎన్ టి యు సి  రాష్ట్ర కార్యదర్శి ఎం ఏ రఫిక్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్ వి యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందున కార్మికులకు భద్రత లేకుండా పోయిందని  కార్మికులకు నష్టం జరుగుతోందని సంస్థలను ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం రూ.26 వేలు ఉన్నదాన్ని అని రంగాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలలో విస్తరించాలని అదేవిధంగా రైతాంగ పనులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి ప‌ర్మినెంట్‌గా ఉద్యోగులను నియమించాలని ఆయన కోరారు. అన్ని రంగాల్లో ఉన్న కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, పార్లమెంట్ అధికార ప్రతినిధి కూరెళ్ళ విజయ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల నాగరాజు, నాయకులు జంపాల చంద్రశేఖర్, భూతం వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?