పట్టణంలో ఆగిన రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం

పట్టణంలో ఆగిన రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి


నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 27 (క్విక్ టుడే) : పట్టణంలో పెదగడియారం నుండి పెద్దబండ వరకు, డీఈఓ ఆఫీసు నుండి కలెక్టరేట్ వరకు ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం,సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు.
మంగళవారం సుందరయ్య భవన్ లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో ఎన్నికల సందర్భంగా  ఆగిన రోడ్డు విస్తరణ పనులు తిరిగి చేపట్టకపోవడంతో రోడ్లపై కంకర, గుంటలు, దుమ్ము ధూళి డ్రైనేజీ నీటితో అస్తవ్యస్తంగా  తయారై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే ఆగిన  పనులు చేపట్టాలని  డిమాండ్ చేశారు.  

ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని కోరారు. మున్సిపాలిటీ వారు నిర్వాసితులకు టి డి ఆర్  ద్వారా నూతన భవన నిర్మాణ అనుమతులు ఎలాంటి ఫీజు లేకుండా ఇస్తామని చేసిన వాగ్దానం ఎక్కడా అమలు జరగలేదని అన్నారు. వెంటనే నిర్వాసితులకు టిడిఆర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం స్థలం ఇచ్చి  ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నల్గొండ పట్టణంలో నిర్మించిన 552 డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర అసంపూర్తిగా ఉన్న రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి లాటరీ ద్వారా ఎంపిక చేసిన  లబ్ధిదారులకు స్వాధీనపరచాలని కోరారు.

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్గొండ పట్టణ విలీన, శివారు ప్రాంతాలలో ప్రభుత్వం ద్వారా నిర్మాణమైన కాలనీలలో , గ్రామకంఠం భూములలో నిర్మించుకున్న ఇండ్లకు మునిసిపాలిటీ వారు ఇంటి యజమాని పేరు లేకుండా హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని ఇస్తున్న ఇంటి పన్ను డిమాండ్ నోటీసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2023-24 సంవత్సరానికి ఇంటి యజమాని పేరుతో డిమాండ్ నోటీసు ఇవ్వాలని గతంలో సిపిఎం పార్టీ తరఫున చైర్మన్ , కమిషనర్ లకు విజ్ఞప్తి చేశామని అన్నారు. దానిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల పద్మ,  పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి ,అద్దంకి నరసింహ లు పాల్గొన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?